PM Modi: స్పీకర్ ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు..
- లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నిక
- ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టిన ప్రధాని మోడీ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన మోడీ.. రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ పదవికి ప్రధాని నరేంద్ర మోడీ తన పేరును ప్రతిపాదించారు. ఎన్డీయేలోని అన్ని భాగస్వామ్య పార్టీలు ఆయన పేరుకు మద్దతు పలికాయి. ఆ తర్వాత.. వాయిస్ ఓటు ద్వారా ఈ పదవికి ఎంపికయ్యారు. మరోవైపు.. కాంగ్రెస్ తరుఫు నుంచి ఎంపి కె. సురేష్ను లోక్సభ స్పీకర్గా ఎన్నుకునే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. ముజువాణీ ఓటుతో ఓం బిర్లా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో.. వరుసగా రెండోసారి స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టారు.
Parliament: లోక్సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్..
Also Read
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని బిర్లాపై ప్రశంసలు కురిపించారు. సభ ప్రజల అంచనాలకు అనుగుణంగా ఉండేలా చూడడంలో బిర్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నానని మోడీ తెలిపారు. మీ మధురమైన చిరునవ్వు సభ మొత్తాన్ని సంతోషంగా ఉంచుతుందని ప్రశంసల జల్లు కురిపించారు. మీరు రెండవసారి స్పీకర్ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం అని బిర్లాను అభినందించారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో జరగని పనులు మీ అధ్యక్షతన ఈ సభ వల్లే సాధ్యమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. కీలక బిల్లులు మీ నాయకత్వంలో ఆమోదం పొందాయని.. ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్లు వచ్చాయని తెలిపారు. 17వ లోక్సభ సాధించిన విజయాల గురించి దేశం గర్విస్తుందని తనకు చాలా నమ్మకం ఉందని స్పీకర్ ఓం బిర్లాపై పొగడ్తలతో ముంచెత్తారు.
IND vs ENG Semi Final: భారత్, ఇంగ్లండ్ సెమీస్కు ‘నో రిజర్వ్ డే’.. కారణం ఏంటంటే?
మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు ప్రభుత్వం సహకరించాలన్నారు. ప్రభుత్వానికి ఎక్కువ రాజకీయ అధికారం ఉంది.. అలాగే ప్రతిపక్షం కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని సూచించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణచివేయడం అప్రజాస్వామికం.. ప్రతిపక్షం ప్రభుత్వానికి పూర్తిగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల వాణి ఎంతవరకు వినిపిస్తుందో ఈ సభలో స్పీకర్ నిర్ణయిస్తారని, అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశ ప్రజలు కట్టుబడి ఉన్నారని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. ప్రజల మద్దతుతో మేము పార్లమెంటులో పూర్తిగా ప్రాతినిధ్యం వహిస్తామని.. వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షించడానికి పోరాడుతూనే ఉంటామని రాహుల్ గాంధీ చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
-
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?