Kesineni Swetha: మేనిఫెస్టోలోని హామీలను కూటమిలోని ఏ పార్టీ అమలు చేస్తుందో ప్రకటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Swetha: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఎన్నికలు లోకల్కి, నాన్లోకల్కి మధ్య జరుగుతున్నాయని కేశినేని శ్వేత అన్నారు. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్టం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35, 42వ డివిజన్లలో తన తండ్రి కేశినేని నాని తరఫున కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలో గెలిస్తే వాళ్ల ప్రలోభాలు,లాభియింగ్ కోసం పనిచేసుకుంటారని.. గెలవక పోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్లి వాళ్ళ బిజినెస్లు చూసుకుంటారని ఎద్దేవా చేశారు. కేశినేని నాని విజయవాడ ప్రజలకు ముద్దు బిడ్డ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇక్కడే పుట్టారు.. పుట్టిన ఊరు కోసం విజయవాడ ప్రజల కోసం నీతిగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి కేశినేని నాని అంటూ పేర్కొన్నారు.
Read Also: Dadisetti Raja: గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలి..
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
10 సంవత్సరాలుగా విజయవాడకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. కేశినేని భవన్ ద్వారా విజయవాడ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని.. నీతిగా నిజాయితీగా విజయవాడ ప్రజల కోసం పనిచేసే వారిని ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని ప్రజలకు సూచించారు. 8000 కోట్లతో హాస్పిటల్స్, ఫ్లైఓవర్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లు తెచ్చింది కేశినేని నానినే అంటూ ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఉందని.. 265 గ్రామీణ ప్రాంతాలకు వాటర్ ట్యాంక్లు అందించిన ఘనత కేశినేని నానిదని చెప్పారు. అలాగే ఆటో నగర్ లో 60 సంవత్సరాల నుంచి ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేశినేని నాని 6 లక్షల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మించారన్నారు. 60 సంవత్సరాలు వెనుక బడి ఉన్న విజయవాడను గత 10 సంవత్సరాల నుంచి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి విజయవాడ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని.. ఉపాధి కల్పనా అవకాశాలు యువతకు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కచ్చితంగా కేశినేని నానిని ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆసిఫ్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారు..
42వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సంక్షేమం గురించి బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. బీజేపీ పాలనలో ముస్లిం మైనార్టీలను ఏ విధంగా అణగతొక్కారో ప్రజలంతా చూశారన్నారు. కేంద్రంలో ముస్లిం మైనార్టీలపై విరుచుకుపడుతూ, వాళ్లని అణగదొక్కేలా చట్టాలు చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ముస్లిం మైనార్టీలను ప్రేమగా చూస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఆమె ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు, హిందువులు , అన్ని కులాల ప్రజలు కలసి మెలిసి జీవిస్తున్నారని ఆమె చెప్పారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఓ మాయా జాబితా అని.. బీజేపీకి ఎటువంటి సంబంధం లేకుండా మేనిఫెస్టో ఉందన్నారు. మేనిఫెస్టోలోని హామీలను మూడు పార్టీల్లో ఏ పార్టీ అమలు చేస్తుందో ప్రకటించాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో వైసీపీని కాపీ కొట్టినట్లుగా ఉందన్నారు. గత ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో మాయమైపోయిందని… హామీల అమలు చేయలేదన్నారు. 14 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేసిన మేలు శూన్యమని ఆరోపించారు.
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!