Kesineni Swetha: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Swetha: తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు. ప్రతి ఒక్కొక్క గడపకు వెళ్తుంటే.. జగన్మోహన్ రెడ్డికే ఓటు వేస్తాం.. జగన్ బిడ్డను గెలిపించుకుంటాం.. జగన్ అన్నను గెలిపించుకుంటాం.. జగన్ మామను గెలిపించుకుంటాం.. అని చెప్తున్నారన్నారు. ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు.. చాలా సంతోషంగా ఉన్నారు.. జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కేశినేని శ్వేత పేర్కొన్నారు.
నవరత్నాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె అన్నారు. ప్రతి పేద వాడి ఇంట్లో అమ్మ ఒడి, చేయూత, పెన్షన్ వంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి అందించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు సంవత్సరాలు కొవిడ్ ఉన్నా కానీ 7 శాతం పావర్టీ రేటును జగన్ తగ్గించారన్నారు. పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం జగన్ సర్కారు అని ఆమె వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు కోసం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 45 వేల పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరు ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారని, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారన్నారు.
Also Read
కేశినేని నాని విజయవాడ ప్రజలకు ఒక పెద్ద కొడుకు లాంటి వాడన్నారు. విజయవాడ ప్రాంతం కోసం పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని ఎంతో కృషి చేశారని కేశినేని శ్వేత తెలిపారు. కేశినేని భవన్ ద్వారా ఎప్పుడు పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పుకొచ్చారు. విజయవాడలో అసాధ్యం అయినా పనులను కూడా చేసి చూపించిన వ్యక్తి కేశినేని నాని అంటూ పేర్కొన్నారు. విజయవాడ రూపురేఖలు మార్చిన వ్యక్తి కేశినేని నాని అంటూ చెప్పారు. 8000 కోట్లతో విజయవాడ అభివృద్ధి కోసం కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, ఎయిర్ పోర్ట్, హాస్పిటల్, రింగ్ రోడ్డు, ఇవ్వి అన్ని కేశినేని నాని విజయవాడ కోసం చేసిన అభివృద్ధి అని తెలిపారు. ఏ నగరంలో చేయని అభివృద్ధి విజయవాడ నగరంలో కేశినేని నాని చేసి చూపించారన్నారు. విజయవాడను జగన్మోహన్ రెడ్డి ట్రేడ్ అండ్ బిజినెస్గా మార్చబోతున్నారని కేశినేని శ్వేత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Russian Oil: రష్యా చమురు కొనుగోలులో భారత్ జోరు..
-
Buchi Babu: అచ్చెమ్మ క్యారెక్టర్ రేంజ్ ఏంటో బుధవారం చూస్తారు.. జాన్వీ కపూర్ రోల్పై డైరెక్టర్ బుచ్చిబాబు షాకింగ్ కామెంట్స్!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Ananta Sriram: ‘పెద్ది’ ఐటమ్ సాంగ్ విమర్శలపై ఇచ్చిపడేసిన అనంత శ్రీరామ్.. ‘వాళ్లే అసలైన ఐటమ్ గాళ్లు’!
-
Khawaja Asif: ఖురాన్తో బెదిరింపులు.. చంపేస్తామంటూ పాక్ రక్షణమంత్రి వార్నింగ్..
ట్రెండింగ్
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!