Kesineni Nani: ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున నగర్ లో 5.70లక్షలు రూపాయల నిధులతో అభివృధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయిందన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. మానవ అభివృద్ధి కావాలి.. గ్రాఫిక్స్ అభివృధి ప్రజలకు ఏందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను.. బీసీలకు సముచిత స్థానం కల్పన జగన్ కే సాధ్యమన్నారు. టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని ఎంపీ కేశినేని నాని అడిగారు.
Read Also: Tantra Movie: పిల్లబచ్చాలు రావోద్దు.. ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల ‘తంత్ర’ పోస్టర్!
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
ప్రతీ డివిజన్ లో 20 కోట్లపై బడి అభివృద్ధి జరిగింది అని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీలు వుండేవి అన్నారు. కొండ ప్రాంతంలో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమం, అభివృధి ఆపొద్దు అని జగన్ చెప్పారు.. ఓ వర్గానికి చెందిన మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరం అని ఆయన చెప్పుకొచ్చారు. గత 10సం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గద్దె ఏం అభివృద్ధి చేశారు.. మాజీ సీఎం చంద్రబాబు నియోజక వర్గంలో కూడా అనేక అభివృధి, సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగుర వేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?