Kesineni Chinni: నాయకులు పోయేవాళ్లు పోతుంటారు.. కానీ, కార్యకర్తలే నేతలను తయారు చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Chinni: నాయకులు పోయేవాళ్లు పోతుంటారు.. కానీ, కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారు అన్నారు టీడీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త కేశినేని చిన్ని.. తిరువూరులో పర్యటించిన ఆయనకు స్థానిక నేతలు స్వాగతం పలికారు.. భారీ ర్యాలీ నిర్వహించారు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరువూరు పట్టణం రెండవ వార్డ్ లో ఇతర పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు.. వారికి టీడీపీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేశినేని చిన్ని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసారు. కానీ, కొంతమంది పదవులు అనుభవించి.. మళ్లీ పదవులు రావటం లేదని వేరే పార్టీలోకి వెళ్ళిపోయారని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కి ముఖ్యం కార్యకర్తలే ఎందుకంటే పార్టీలో నాయకులు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని తెలిపారు.
Read Also: Prabhas: దిల్ రాజు తమ్ముడి కొడుకు పెళ్లి.. ప్రభాస్ ఇంటికెళ్ళి ఆహ్వానం
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
- Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
- Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన 'నెయ్యి'ని తయారు చేయండి ఇలా..!
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
ఇక, ఇక్కడ ఒక అభ్యర్థికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే రెండుసార్లు గెలిచారు.. మూడుసార్లు ఓడిపోయారు.. ఆయన సతీమణికి జెడ్పీచైర్మన్ పదవిని కూడా కల్పించారు చంద్రబాబు నాయుడు అని గుర్తుచేశారు. మరోవైపు.. మా కుటుంబంలో కూడా ఒక వ్యక్తి (కేశినేని నాని)కి రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పించారు. వాళ్లు ఇద్దరికీ ఈసారి టికెట్ రాదనే ఉద్దేశంతో స్వార్థం కోసం వైసీపీలో చేరి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాయకులు పోయేవాళ్లు పోతుంటారు.. కానీ, కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారన్న ఆయన.. నిజమైన టీడీపీ కార్యకర్తలు ఎండనకా వానకా.. కేసులకు భయపడకుండా టీడీపీని అంటి పెట్టుకొని ఉన్నారు.. పార్టీ వదిలి వెళ్లిపోయిన నాయకులకు ప్రజాక్షేత్రంలో వారికి శృంగభంగం తప్పదని హెచ్చరించారు. పార్టీ ఇప్పటివరకు ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించలేదు .. కానీ, పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి అని స్పష్టం చేశారు కేశినేని చిన్ని.
తాజావార్తలు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!