Ganja With Students: గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు
- కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన.
- గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి.
- అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja With Students: కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల బృందం అనుకోకుండా గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొదటగా విషయం విన్న అక్కడి ఎక్సైజ్ అధికారి ఆశ్చర్యపోయారు. త్రిసూర్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టూర్కు వెళ్లిన ఘటన ఆదిమాలిలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు పొరపాటున ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి.. అగ్గిపుల్లల కోసం అధికారులను అడగ్గా, ఎక్సైజ్ అధికారులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి, హాషీష్ ఆయిల్, నిషిద్ధ పదార్థాలను నింపిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పదార్థాలతో దొరికిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
Read Also: Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
అందిన సమాచారం ప్రకారం, త్రిసూర్లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన మున్నర్ ట్రిప్ కు వెళ్లారు 100 మంది విద్యార్థులు. ఒక హోటల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు గంజాయి బీడీ కాల్చడానికి బయటకు వచ్చారు. అయితే, దానిని వెలిగించడానికి అగ్గిపుల్లలు లేకపోవడంతో.. ఎక్సైజ్ కార్యాలయం వెనుక వైపు చూసి అక్కడికి చేరుకున్నామని, అకస్మాత్తుగా అధికారులను చూడగానే ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీసారని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసును విచారణ చేయగా నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గంజాయి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు విద్యార్థులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులు అదుపులో తీసుకుని విచారించి సూమారు ఆరు గ్రాముల గంజాయిని సీజ్ చేసారు అధికారులు. చాలామంది పిల్లలు తొలిసారిగా గంజాయి సేవించినటు విచారణలో వెల్లడైంది.
Read Also: Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..
ఉపాధ్యాయులతో పాటు ఇతర విద్యార్థులను వెనక్కి పంపినట్లు అధికారి తెలిపారు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి తమ వెంట పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సందర్శనల సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం విరివిగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!