Ganja With Students: గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు
- కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన.
- గంజాయి అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి.
- అధికారులను అగ్గిపెట్టె అడిగిన విద్యార్థులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja With Students: కేరళలోని ఇడుక్కిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థుల బృందం అనుకోకుండా గంజాయి బీడీ అంటించుకోవడం కోసం ఎక్సైజ్ ఆఫీసుకెళ్లి అధికారులను అగ్గిపెట్టె అడిగిన సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మొదటగా విషయం విన్న అక్కడి ఎక్సైజ్ అధికారి ఆశ్చర్యపోయారు. త్రిసూర్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టూర్కు వెళ్లిన ఘటన ఆదిమాలిలో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు పొరపాటున ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లి.. అగ్గిపుల్లల కోసం అధికారులను అడగ్గా, ఎక్సైజ్ అధికారులు వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని వారి వద్ద నుంచి గంజాయి, హాషీష్ ఆయిల్, నిషిద్ధ పదార్థాలను నింపిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిషేధిత పదార్థాలతో దొరికిన ఇద్దరు మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
Read Also: Amaran : అమరన్ ఓటీటీ పార్టనర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
అందిన సమాచారం ప్రకారం, త్రిసూర్లోని ఎయిడెడ్ పాఠశాలకు చెందిన మున్నర్ ట్రిప్ కు వెళ్లారు 100 మంది విద్యార్థులు. ఒక హోటల్లో రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థులు గంజాయి బీడీ కాల్చడానికి బయటకు వచ్చారు. అయితే, దానిని వెలిగించడానికి అగ్గిపుల్లలు లేకపోవడంతో.. ఎక్సైజ్ కార్యాలయం వెనుక వైపు చూసి అక్కడికి చేరుకున్నామని, అకస్మాత్తుగా అధికారులను చూడగానే ప్రమాదాన్ని పసిగట్టి బయటకు పరుగులు తీసారని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసును విచారణ చేయగా నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని ఎక్సైజ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గంజాయి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు విద్యార్థులపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థులు అదుపులో తీసుకుని విచారించి సూమారు ఆరు గ్రాముల గంజాయిని సీజ్ చేసారు అధికారులు. చాలామంది పిల్లలు తొలిసారిగా గంజాయి సేవించినటు విచారణలో వెల్లడైంది.
Read Also: Gachibowli Fly Over: గచ్చిబౌలి ఫ్లై ఓవర్ క్లోజ్.. ఎప్పటి వరకు అంటే..
ఉపాధ్యాయులతో పాటు ఇతర విద్యార్థులను వెనక్కి పంపినట్లు అధికారి తెలిపారు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులను పిలిపించి తమ వెంట పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల సందర్శనల సమయంలో మాదక ద్రవ్యాల వినియోగం విరివిగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!