POCSO Case: కోర్టు సంచలన తీర్పు.. దంపతులకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCSO Case: కేరళలోని మంజేరిలోని ప్రత్యేక లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (POCSO) కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినందుకు ఒక జంటకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో నిందితులైన మహిళ, ఆమె భర్త కలిసి దారుణానికి పాల్పడ్డారు. మొదటగా బాధితురాలి తల్లి తన భర్తను విడిచిపెట్టిన తర్వాత ఈ దారుణమైన కేసు వెలుగులోకి వచ్చింది. తిరువనంతపురంలో ఉన్నప్పుడు నిందితురాలు ఆమె భర్త(నిందితుడు)తో పరిచయం పెంచుకుని ఆ తర్వాత తన చిన్న కుమార్తెతో సహా అతనితో పారిపోయింది.
Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ఆ తర్వాత డిసెంబర్ 2019 – అక్టోబర్ 2021 మధ్య ఈ ముగ్గురూ పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో అద్దె ఇళ్లలో నివసించారు. ఈ సమయంలోనే ఆ వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి (నిందితురాలు) కేవలం ప్రేక్షకురాలుగా ఉండటమే కాకుండా.. ఈ నేరాలకు సహకరించినట్లు నిర్ధారణ అయింది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన కుమార్తెకు బలవంతంగా మద్యం తాగించి, బెదిరింపులకు పాల్పడిందని.. అమ్మాయి మెదడులో చిప్ అమర్చారని, నువ్వు ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే తమకు తెలిసిపోతుందని ఆ బాలికను భయపెట్టినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.
Harmanpreet Kaur Wax Statue: టీమిండియా కెప్టెన్ కు అరుదైన గౌరవం.. ఆ మ్యూజియంలో మైనపు విగ్రహం..!
దీనితో కోర్టు ఇద్దరికి చెరో 180 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. ఇద్దరు దోషులకు చెరో రూ.11.75 లక్షల జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించడంలో విఫలమైతే వారి జైలు శిక్షకు మరో 20 నెలలు చేరుతుందని వెల్లడించింది. కోర్టు ఈ శిక్షను పేర్కొంటూ.. POCSO చట్టంలోని వివిధ నేరాలకు గాను నిందితులు ఏకకాలంలో అనేక 40 ఏళ్ల శిక్షలను అనుభవించాలని ఆదేశించింది. దీని ద్వారా మొత్తం శిక్ష 180 సంవత్సరాలుగా మారింది. బాధితురాలికి మద్దతుగా, నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానాలను ఆ బాలికకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వ సర్వైవర్ అసిస్టెన్స్ స్కీమ్ కింద ఆమెకు అదనపు ఆర్థిక సహాయం అందించాలని జిల్లా న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!