KCR : తొమ్మిదేళ్లు సరిగ్గా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కాలేదన్నారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన మెదక్లో మాట్లాడుతూ.. రైతు బంధు వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా..? కరెంట్ సరిగా వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..? అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు…ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని, ఐదు నెలల్లో తెలంగాణ అంతా ఆగమాగం అయ్యిందన్నారు. రైతు బంధు పొలం దున్నితేనే ఇస్తారట.. వరి నాటెసేటప్పుడు వేయాల్సిన రైతు బంధు కొత కోసిన తర్వాత ఇస్తుంది… దీనికంటే పెద్ద జోక్ ఉంటుందా అని ఆయన మండిపడ్డారు. కరెంట్ పోవడం వల్ల పరిశ్రమలు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంది..ఐటీ పరిశ్రమ దెబ్బ తినే అవకాశం ఉందని, మల్లన్నసాగర్ నుంచి నర్సాపూర్ కి నీళ్లు రావాలంటే ఇక్కడ మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలన్నారు. కేసీఆర్ నర్సాపూర్ ని ఎలా అభివృద్ధి చేశాడో తెలుసు అని, మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్లు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే వెనక్కి తీసుకెళ్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’వృద్దులకు 4 వేలు ఇస్తానన్న పెన్షన్ ఏది. మహిళలకు 2500 ఇస్తున్నామని రాహుల్ గాంధీ నిర్మల్ సభలో చెబుతున్నారు. మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు..? నిన్ను రెండు సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ కాదా..? ముసలి తనానికి కుసుమ గుడాలు అన్నట్టు ఎందుకు పోయావు. నరేంద్ర మోడీ వల్ల పైసా లాభం లేదు. సబ్ కా సాత్ సత్య నాష్ అయ్యింది. మోడీ ఎజెండాలో పేదల బాధలు, పేదల కష్టాలు, రైతుల ఇబ్బందులు ఉండవు. యూపీ ఎన్నికలు వస్తే మళ్ళీ స్వారీ చెప్పి ఎన్నికలకు పోయిండు. గిరిజన తండాలను గ్రామ పంచాయితీలు చేసింది కేసీఆర్. 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది కేసీఆర్. అందరం ఏకమై తెలంగాణాని కాపాడుకోవాలి. కృష్ణా, గోదావరి నీళ్లు మోడీ తమిళనాడు కి తీసుకువెళ్లే కుట్ర చేస్తున్నాడు. వెంకట్రామిరెడ్డి అత్యదిక మెజారిటీ గెలుస్తాడాని సర్వేలు చెబుతున్నాయి. నర్సాపూర్ లో ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర. పటాన్ చెరు బయలుదేరిన కేసీఆర్. ‘ అని కేసీఆర్ అన్నారు.
Also Read
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- India vs Sri Lanka Test: మానవ్ సుతార్ సంచలనం.. అశ్విన్, హర్భజన్ రికార్డులు బద్దలు..!
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
తాజావార్తలు
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
-
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
-
Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!