Advocate Mohit Rao: ఈడీ కేసుపై కవిత న్యాయవాది కీలక వ్యాఖ్యలు..
- ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు- కవిత న్యాయవాది మోహిత్ రావు
- సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత..
- ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుంది- న్యాయవాది
- కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చినవారు కేసులో నిందితులుగా కూడా లేరు
- సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉంది- మోహిత్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కాగా.. ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు. ఈరోజు రాత్రికి కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటలకు కవిత, కేటీఆర్, హరీష్ రావు.. ఇతర బీఆర్ఎస్ నేతలు హైదరాబాదుకు రానున్నారు.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
ఇదిలా ఉంటే.. కవితపై ఈడీ కేసుపై కవిత న్యాయవాది మోహిత్ రావు మాట్లాడుతూ, ఈడీది పూర్తిగా అసంబద్ధ దర్యాప్తు అని ఆరోపించారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో అరెస్టు అయిన తర్వాత ఇచ్చిన వాటిని మాత్రమే దర్యాప్తు సంస్థ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన వారు కేసులో నిందితులుగా కూడా లేరని అన్నారు. సెక్షన్ 45 ప్రకారం మహిళకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. విద్యాధికురాలు, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆమె మహిళ కాకుండా పోరు అని సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన అన్నారు. తాను మొదటినుంచి అరెస్టు అక్రమం అని చెబుతూ వచ్చానని.. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అది నిరూపితమైందని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ అసంబద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని చెప్పారు. ట్రయల్ కోర్టులో బెయిల్ బాండ్స్ సమర్పించాల్సి ఉంటుందని.. అనంతరం జైలు నుంచి కవిత విడుదల అవుతారని న్యాయవాది మోహిత్ రావు తెలిపారు. ఇవాళ జైలు నుంచి విడుదల అవుతారని న్యాయవాది చెప్పారు.
Read Also: AMMA: పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..రాజీనామాపై మోహన్లాల్ ఎమోషనల్!
తాజావార్తలు
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..