Kavali Mla Pratapkumar Reddy: వైసీపీలో కావలి ఎమ్మెల్యే కామెంట్ల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకవైపు మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటు ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య మాటల యుద్ధం, ప్రచ్చన్నయుద్దం ముదురుతోంది. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కావలి నియోజక వర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో చిన్నచిన్న అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కొందరు అనధికారకంగా గ్రావెల్ ను తవ్వుకుంటున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికే టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. వారి హయాంలో జరిగిన అవినీతి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
తామేమీ సత్యవంతులం కాదని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. కావలి నియోజకవర్గంలో షాడో ఎం.ఎల్.ఏ.గా వ్యవహరిస్తున్న ఒక నేత భారీగా తవ్వకాలు చేసినట్టు ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా వ్యాఖ్యానించడంపై విపక్ష నేతలు నోరెళ్లబెడుతున్నారు. మేం చేసిన ఆరోపణలు ఎంత వాస్తవమో దీనిని బట్టి అర్థం చేసుకోవాలంటున్నారు. స్వంత పార్టీ, ప్రభుత్వంపై గతంలోనూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కావలి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలని క్యాడర్ వాపాతోంది.
Read Also: Water Contamination : హిమాచల్ ప్రదేశ్లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!