Kavali Mla Pratapkumar Reddy: వైసీపీలో కావలి ఎమ్మెల్యే కామెంట్ల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకవైపు మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటు ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య మాటల యుద్ధం, ప్రచ్చన్నయుద్దం ముదురుతోంది. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కావలి నియోజక వర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో చిన్నచిన్న అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కొందరు అనధికారకంగా గ్రావెల్ ను తవ్వుకుంటున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికే టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. వారి హయాంలో జరిగిన అవినీతి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
తామేమీ సత్యవంతులం కాదని కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తున్నాయి. కావలి నియోజకవర్గంలో షాడో ఎం.ఎల్.ఏ.గా వ్యవహరిస్తున్న ఒక నేత భారీగా తవ్వకాలు చేసినట్టు ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఇలా వ్యాఖ్యానించడంపై విపక్ష నేతలు నోరెళ్లబెడుతున్నారు. మేం చేసిన ఆరోపణలు ఎంత వాస్తవమో దీనిని బట్టి అర్థం చేసుకోవాలంటున్నారు. స్వంత పార్టీ, ప్రభుత్వంపై గతంలోనూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కావలి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలని క్యాడర్ వాపాతోంది.
Read Also: Water Contamination : హిమాచల్ ప్రదేశ్లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!