Yathindra Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య గురించి సొంత కొడుకు ఏం అన్నారంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yathindra Siddaramaiah: కర్ణాటక రాజకీయం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో రాష్ట్రంలో సీఎం మార్పు జరుగుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా సీఎం సిద్ధరామయ్య కొడుకు మాట్లాడిన మాటలు దేశం దృష్టిని ఆకర్షించాయి.
READ ALSO: World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్తోనే భారత్కు ముప్పు! శ్రీలంక ఉన్నా
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
యతీంద్ర సిద్ధరామయ్య ఏం అన్నారంటే..
బెళగావిలో జరిగిన బహిరంగ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్య బుధవారం తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఆయన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్కు పార్టీని నడిపించగల నాయకుడు అవసరమని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకుడు, ప్రగతిశీల దృక్పథం కలిగిన సీనియర్ హస్తం పార్టీ నాయకుడు సతీష్ జార్కిహోళి సిద్ధరామయ్య తర్వాత ఆ బాధ్యతను స్వీకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. సిద్ధరామయ్య నవంబర్లో ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ రాబోయే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిని మార్చవచ్చనే ఊహాగానాలు రాష్ట్రంలో తీవ్రమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. కానీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పు జరిగితే షెడ్యూల్డ్ తెగకు చెందిన సతీష్ జార్కిహోళిని సీఎం అభ్యర్థిగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా యతీంద్ర సిద్ధరామయ్య మాట్లాడుతూ.. “కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి మాత్రమే పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించాలని చెబుతున్నాను. ముఖ్యమంత్రిని మార్చడం గురించి మాట్లాడలేదు. ఇదంతా ఊహాగానాలు మాత్రమే. ముఖ్యమంత్రిని మార్చాలని ఎవరూ డిమాండ్ చేయడం లేదు. ఆయన (సిద్ధరామయ్య) మొత్తం పదవీకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే సీఎం పదవిపై నిర్ణయం హైకమాండ్, ఎమ్మెల్యేలపై ఆధారపడి ఉంటుంది. నా ప్రకటన ముఖ్యమంత్రిని మార్చడం గురించి కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
యతీంద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యల గురించి డిప్యూటీ సీఎం డికె శివకుమార్ మీడియా అడిగినప్పుడు.. “మీరు (మీడియా) ఆయనను (యతీంద్ర) ఎందుకు అలా అన్నారో అడగాలి. మీరు నన్ను అడిగితే, నేను ఏమి చెప్పగలను?” అని చెప్పారు. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ అంతర్గత చర్చలు ఎన్ని ఉన్నా, నాయకత్వ మార్పు గురించి ప్రజల ఊహాగానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్ తన వైఖరిని కొనసాగించింది. తాజా వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.
READ ALSO: Indigo Flight Emergency: గాల్లో 166 మంది ప్రాణాలు.. ఇండిగో విమానంలో సమస్య.. తర్వాత ఏం జరిగింది?
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం