Karnataka: ఇస్లాం మతంలోకి మారకపోతే.. అత్యాచారం కేసు పెడతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- ఇస్లాం మతంలోకి మారకపోతే.. అత్యాచారం కేసు పెడతా
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2024లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లైన కొంత కాలం తర్వాత తన భార్య తనును బలవంతంగా మతం మార్చిందని ఆరోపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో వెలుగుచూసింది. తహసీన్ హోసమణితో తనకు మూడేళ్లుగా సంబంధం ఉందని విశాల్ కుమార్ గోకవి తెలిపాడు. ఆ తర్వాత 2024 నవంబర్లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని వెల్లడించాడు.
Also Read:Bojjala Sudhir Reddy: దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. వినూత ఘటనలో నా ప్రమేయం లేదు!
Also Read
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
అయితే, వివాహం తర్వాత, ముస్లిం ఆచారాల ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని హోసమణి తనపై ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించాడు. అయితే వివాహ బంధంలో కలహాలకు చోటు ఇవ్వకూడదని భార్య చెప్పిన దానికి అంగీకరించి ఏప్రిల్ 25న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ వేడుకలో తనకు తెలియకుండానే తన పేరు మార్చారని గోకవి ఆరోపించాడు. ఆ కార్యక్రమంలో ఒక ‘మౌల్వీ’ (ముస్లిం మతాధికారి) తనకు తెలియకుండానే మతం మార్చాడని కూడా చెప్పాడు.
Also Read:RCB: బెంగళూరు తొక్కిసలాట కేసు.. కర్ణాటక ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ముస్లిం ఆచారాల ప్రకారం గోకవి హోసామణిని వివాహం చేసుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అయింది. జూన్ 5న హిందూ ఆచారాల ప్రకారం తన కుటుంబం వివాహానికి సన్నాహాలు చేసిందని గోకవి తెలిపాడు. హోసామణి మొదట అంగీకరించిందని, కానీ తరువాత ఆమె కుటుంబం ఒత్తిడితో వెనక్కి తగ్గిందని ఆరోపించాడు. తాను ఇస్లాం మతంలోకి మారకపోతే, తనపై అత్యాచారం కేసు పెడతానని ఆమె తనను హెచ్చరించిందని గోకవి ఆవేదన వ్యక్తం చేశాడు. హోసామణి, ఆమె తల్లి బేగం బాను తనను నమాజ్ చేయాలని, జమాత్కు హాజరు కావాలని బలవంతం చేశారని కూడా గోకవి ఆరోపించాడు. ఈ వ్యవహారంపై గోకవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 299, సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Manish Pandey: వర్షం వచ్చినా, ఎండ ఉన్నా ఆగం.. కేకేఆర్ హీరో మనీష్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!