Karnataka: ఇస్లాం మతంలోకి మారకపోతే.. అత్యాచారం కేసు పెడతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- ఇస్లాం మతంలోకి మారకపోతే.. అత్యాచారం కేసు పెడతా
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2024లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లైన కొంత కాలం తర్వాత తన భార్య తనును బలవంతంగా మతం మార్చిందని ఆరోపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో వెలుగుచూసింది. తహసీన్ హోసమణితో తనకు మూడేళ్లుగా సంబంధం ఉందని విశాల్ కుమార్ గోకవి తెలిపాడు. ఆ తర్వాత 2024 నవంబర్లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నామని వెల్లడించాడు.
Also Read:Bojjala Sudhir Reddy: దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. వినూత ఘటనలో నా ప్రమేయం లేదు!
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
అయితే, వివాహం తర్వాత, ముస్లిం ఆచారాల ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని హోసమణి తనపై ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించాడు. అయితే వివాహ బంధంలో కలహాలకు చోటు ఇవ్వకూడదని భార్య చెప్పిన దానికి అంగీకరించి ఏప్రిల్ 25న ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఆ వేడుకలో తనకు తెలియకుండానే తన పేరు మార్చారని గోకవి ఆరోపించాడు. ఆ కార్యక్రమంలో ఒక ‘మౌల్వీ’ (ముస్లిం మతాధికారి) తనకు తెలియకుండానే మతం మార్చాడని కూడా చెప్పాడు.
Also Read:RCB: బెంగళూరు తొక్కిసలాట కేసు.. కర్ణాటక ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ముస్లిం ఆచారాల ప్రకారం గోకవి హోసామణిని వివాహం చేసుకుంటున్నట్లు చూపించే వీడియో వైరల్ అయింది. జూన్ 5న హిందూ ఆచారాల ప్రకారం తన కుటుంబం వివాహానికి సన్నాహాలు చేసిందని గోకవి తెలిపాడు. హోసామణి మొదట అంగీకరించిందని, కానీ తరువాత ఆమె కుటుంబం ఒత్తిడితో వెనక్కి తగ్గిందని ఆరోపించాడు. తాను ఇస్లాం మతంలోకి మారకపోతే, తనపై అత్యాచారం కేసు పెడతానని ఆమె తనను హెచ్చరించిందని గోకవి ఆవేదన వ్యక్తం చేశాడు. హోసామణి, ఆమె తల్లి బేగం బాను తనను నమాజ్ చేయాలని, జమాత్కు హాజరు కావాలని బలవంతం చేశారని కూడా గోకవి ఆరోపించాడు. ఈ వ్యవహారంపై గోకవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 299, సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!