Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది.
READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..
తాజా హైకోర్టు నిర్ణయం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేసిందని హైకోర్టు అభివర్ణించింది. ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్లో.. ఈ చర్య ప్రైవేట్ సంస్థల చట్టబద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషన్ తరుఫు న్యాయవాదులు వాదించారు. జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ ఆదేశంపై మధ్యంతర స్టే విధించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.
ప్రభుత్వ ఆర్డర్పై మంత్రి ఏమన్నారంటే..
కర్ణాటక మంత్రి హెచ్.కె. పాటిల్ ప్రభుత్వం ఏ ప్రత్యేక సంస్థకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ నిర్ణయాన్ని ఏ సంస్థకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా తీసుకురాలేదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించడనికి తీసుకొచ్చాం. ఏదైనా ఉల్లంఘనపై ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.
READ ALSO: Taliban – Islamabad: ఇస్లామాబాద్ను నాశనం చేస్తాం: తాలిబాన్లు
తాజావార్తలు
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!