Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించడానికి ముందస్తు అనుమతి పొందాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై ఈరోజు కోర్టు విచారిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై స్టే విధించింది.
READ ALSO: Ramyakrishna : ఆమె కోసం ఏడ్చిన రమ్యకృష్ణ
Also Read
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..
తాజా హైకోర్టు నిర్ణయం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వును జారీ చేసిందని హైకోర్టు అభివర్ణించింది. ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ దాఖలు చేసిన పిటిషన్లో.. ఈ చర్య ప్రైవేట్ సంస్థల చట్టబద్ధమైన కార్యకలాపాలను నిర్వహించే హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషన్ తరుఫు న్యాయవాదులు వాదించారు. జస్టిస్ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ప్రభుత్వ ఆదేశంపై మధ్యంతర స్టే విధించి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.
ప్రభుత్వ ఆర్డర్పై మంత్రి ఏమన్నారంటే..
కర్ణాటక మంత్రి హెచ్.కె. పాటిల్ ప్రభుత్వం ఏ ప్రత్యేక సంస్థకు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ నిర్ణయాన్ని ఏ సంస్థకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా తీసుకురాలేదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించడనికి తీసుకొచ్చాం. ఏదైనా ఉల్లంఘనపై ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం” అని ఆయన చెప్పారు.
READ ALSO: Taliban – Islamabad: ఇస్లామాబాద్ను నాశనం చేస్తాం: తాలిబాన్లు
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..