Dangerous Dogs : కేంద్రం ఇచ్చిన ఆ ఉత్తర్వులను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
23 ప్రమాదకరమైన కుక్క జాతులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ ఆపరేషన్పై స్టే విధించేందుకు కర్ణాటక హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్దిష్ట జాతుల కుక్కల పెంపకాన్ని నిషేధించాలని ఉద్దేశించిన సర్క్యులర్, వాటిని “ఉగ్రపూరితమైనది మరియు మానవ జీవితానికి ప్రమాదకరం”గా పరిగణించడం వలన న్యాయపరమైన సవాలును ఎదురుకోవాల్సి వచ్చింది.
Also read: Directors Day: దర్శకరత్న జయంతి… మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే వేడుకలు
Also Read
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
కింగ్ సోలమన్ డేవిడ్, డాగ్ ట్రైనర్, మరో పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కర్నాటక రాష్ట్రంలో ప్రత్యేకంగా సర్క్యులర్ అమలుపై స్టే విధించినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక కేంద్రం నివేదించిన ఈ కుక్కల జాతులు నిషేధించబడ్డాయి. పిట్బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోయర్బోయెల్, కంగల్, సెంట్రల్ ఆసియన్ షెపర్డ్ డాగ్ (ఓవ్చార్కా), కాకేసియన్ షెపర్డ్ కుక్క వంటి అనేక జాతుల కుక్కలు నిషేధించబడ్డాయి. ఓవిచారక, సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్నజక్, సర్ప్లాన్ఇనాక్, జపనీస్ టోసా, అకిటా, మస్తిఫ్ఫ్స్ , రోట్వేలేర్, టెర్రియర్స్, రాహుడియాన్ రిడ్జిబాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బష్ కుక్క, మాస్కో గార్డ్ కుక్క, కేన్ కోర్సో, బాన్ డాగ్ రకం కుక్కలను కేంద్రం బ్యాన్ చేసింది.
Also read: AP Weather Report: ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..!
అంతేకాకుండా, ఈ జాతుల యజమానులు తమ పెంపుడు జంతువులను క్రిమిరహితం చేయాలని, అలాగే తదుపరి సంతానోత్పత్తిని నిలిపివేయాలని నిర్దేశించారు. వివిధ సంస్థలు మరియు నిపుణులతో కూడిన పశుసంవర్ధక కమిషన్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ఈ ఆదేశం జారీ చేయబడింది. కమిటీ పైన పేర్కొన్న జాతులను ‘ఉగ్రమైన మరియు మానవ జీవితానికి ప్రమాదకరమైనవి’ అని లేబుల్ చేసింది. అయితే, ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు భారత డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ప్రమాదకరమైన కుక్కలను పెంచుకున్నందుకు లైసెన్సులను రద్దు చేసి నిషేధించాలని కోరుతూ.. దాఖలైన పిటిషన్ను మూడు నెలల్లోగా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏది ఏమైనప్పటికీ.., ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత అధికారులను తప్పనిసరిగా సంప్రదించాలని ఢిల్లీ హైకోర్టు నిర్ద్వంద్వంగా ఆదేశించిందని కర్ణాటక హైకోర్టు హైలైట్ చేసింది.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ..
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!