Movie Ticket Prices: ఏ సినిమా థియేటర్స్ అయినా టికెట్ రూ.200 దాటకూడదు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- ఏ సినిమా థియేటర్స్ అయినా టికెట్ రూ.200 దాటకూడదు..
- కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.
- ముసాయిదా నోటిఫికేషన్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Movie Ticket Prices: సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా, కుటుంబ సమయాన్ని గడిపేందుకు ఓ మార్గం. ముఖ్యంగా వారం రోజుల పని ఒత్తిడి నుండి బయట పడేందుకు, కొందరు కుటుంబ సభ్యులతో పాటు బయటికి వెళ్లే సరదా మూమెంట్స్లో సినిమాలు ప్రధాన భాగంగా నిలుస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో థియేటర్లలో టికెట్ ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు ఇది కాస్త భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also:Vijayawada Double murder: బెజవాడలో కలకలం.. సిటీ నడిబొడ్డున ఇద్దరు యువకుల దారుణ హత్య..
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
ముసాయిదా నోటిఫికేషన్ లో సినిమా టికెట్ ధర గరిష్టంగా రూ.200 మించకూడదని స్పష్టం చేసింది. ఈ పరిమితి రాష్ట్రంలోని అన్ని థియేటర్లకూ, మల్టీప్లెక్స్లకూ వర్తించనుంది. ఈ నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ప్రజలందరికీ సినిమాలు చేరువ కావాలి. టికెట్ ధరల భారంతో సామాన్యులు వెనకడుగు వేయడం మానిపించాలి. గతంలో కొన్ని మల్టీప్లెక్స్లలో టికెట్లు 500 నుంచి 1000 దాకా ఉంటున్నాయి. ఇది సరైనది కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఇది ముసాయిదా నోటిఫికేషన్ కావడంతో, ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలిపేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం.
Read Also:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?
ఈ నిర్ణయంపై ప్రజల నుండి హర్షాతిరేక స్పందన లభిస్తోంది. ఇప్పుడైనా సినిమా టికెట్లు అందరికీ చవకగా లభిస్తే, కుటుంబంతో కలిసి తరచూ సినిమాలకు వెళ్లే అవకాశం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు, మల్టీప్లెక్స్ యజమానులు మాత్రం ఈ నిర్ణయం వల్ల తమ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అంటున్నారు. కాకపోతే దీనికి కారణం లేకపోలేదు. ప్రీమియం ఫార్మాట్లైన ఐమాక్స్, 4DX వంటి వాటికి భారీగా పెట్టుబడులు పెట్టామని.. వాటికి కూడా రూ.200 ధరకు ప్రదర్శించాలంటే నష్టాలే మిగిలిపోతాయని ఒక మల్టీప్లెక్స్ యజమానూలు వాపోతున్నారు.
తాజావార్తలు
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
-
Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
-
IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫినాలే.. ‘కింగ్’ కోహ్లీ మళ్లీ మెరుస్తాడా?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..