Siddaramaiah: కర్ణాటకకు అన్యాయం జరుగుతోంది.. 4 ఏళ్లలో రూ.45 వేల కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్నుల బదలాయింపు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. నాలుగేళ్లలో 45 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని అన్నారు. కర్ణాటక ప్రజలు కట్టే పన్నులు రాష్ట్ర కష్టాలను తీర్చలేక ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. ఇక, 15వ ఆర్థిక సంఘం తర్వాత తక్కువ పన్ను బదిలీ వాటాతో కర్ణాటక గణనీయమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఈ అన్యాయాన్ని సహించలేం.. మా రాష్ట్ర సంక్షేమం కోసం కర్ణాటక ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంలో మేము ఐక్యంగా ఉన్నామని “#SouthTaxMovement” హ్యాష్ట్యాగ్తో ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు.
Read Also: AP Assembly Sessions: ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
అయితే, పన్నుల వ్యవహారంలో కర్ణాటకకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య సహా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ నిరసన తెలుపనున్నారు. పన్నుల బదిలీల్లో కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను సమర్థిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు కట్టే పన్నులతో అప్పులపాలైన ఉత్తరాది రాష్ట్రాలు మనకు ఎప్పటికీ మోడల్ కాలేవన్నారు. ఈ తప్పుడు ఆలోచనను ప్రతి ఒక్కరూ పారద్రోలాలి.. కష్టపడి పటిష్టమైన భారతదేశాన్ని నిర్మిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. న్యాయం కోసం గళం విప్పిన కన్నడి వాసులకు సీఎం సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!