Karnataka CM పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- కర్ణాటకలో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్ధరామయ్య
- పెంచిన ధరలు ప్రజా సేవలకు.. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది
- చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉంది- సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ వంచనను బయటపెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు రూ.8-12 లీటర్ అదనపు వ్యాట్ వసూలు చేస్తుందని తెలిపారు.
Team India Coach : ఆ కండీషన్కు ఓకే చెప్తే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్..?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పన్ను సొమ్మును ఈ ప్రభుత్వం దోచుకుంటోందని రాష్ట్ర ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెంపును సమర్థించారు.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
పెంచిన ధరలు అవసరమైన ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందని ఆయన అన్నారు. ధరలు పెరిగిన తర్వాత కూడా చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్పై 29.84 శాతానికి, డీజిల్పై 18.44 శాతానికి వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచిందని తెలిపారు. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు చాలా దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అన్నారు. పెట్రోల్పై వ్యాట్ 25 శాతం, అదనపు పన్ను రూ. 5.12, మహారాష్ట్రలో డీజిల్పై వ్యాట్ 21 శాతం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకలో పెంచిన ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు.
- Tags
- diesel
- Hike
- Karnataka CM
- petrol
- Price
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!