Karnataka CM పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- కర్ణాటకలో పెట్రోల్.. డీజిల్ ధరల పెంపును సమర్థించిన సీఎం సిద్ధరామయ్య
- పెంచిన ధరలు ప్రజా సేవలకు.. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది
- చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉంది- సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ సహా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలంతా ఈ అంశంపై కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమర్శించారు. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చిన ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంధన ధరలు నేరుగా ఇతర వస్తువుల ధరలను ప్రభావితం చేస్తాయని.. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ వంచనను బయటపెడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు రూ.8-12 లీటర్ అదనపు వ్యాట్ వసూలు చేస్తుందని తెలిపారు.
Team India Coach : ఆ కండీషన్కు ఓకే చెప్తే టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్..?
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పన్ను సొమ్మును ఈ ప్రభుత్వం దోచుకుంటోందని రాష్ట్ర ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్రోల్, డీజిల్ ధరల పెంపును సమర్థించారు.
Pawan Kalyan:19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
పెంచిన ధరలు అవసరమైన ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుందని ఆయన అన్నారు. ధరలు పెరిగిన తర్వాత కూడా చాలా దక్షిణాది రాష్ట్రాల కంటే ఇంధనంపై పన్ను తక్కువగా ఉందని సీఎం పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్పై 29.84 శాతానికి, డీజిల్పై 18.44 శాతానికి వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) పెంచిందని తెలిపారు. ఈ పెరుగుదల ఉన్నప్పటికీ.. మన రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు చాలా దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని అన్నారు. పెట్రోల్పై వ్యాట్ 25 శాతం, అదనపు పన్ను రూ. 5.12, మహారాష్ట్రలో డీజిల్పై వ్యాట్ 21 శాతం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే కర్నాటకలో పెంచిన ధరలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు.
- Tags
- diesel
- Hike
- Karnataka CM
- petrol
- Price
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!