MLA Yatnal: 40,000 కోట్ల కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప ప్రమేయం ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించిన రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఒకటి ధరకు రెండు పడకలను కొనుగోలు చేయవచ్చని యత్నాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Central Cabinet: కొబ్బరి రైతులకు కేంద్రం శుభవార్త..
Also Read
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ఇదిలా ఉంటే.. కర్ణాటకకు చెందిన ఇద్దరు నేతలకు సంబంధించిన అవినీతి కేసులను సుప్రీంకోర్టు విచారిస్తుంది. జనవరి 5న ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్కు సంబంధించిన కొన్ని అక్రమాలకు సంబంధించిన కేసు, యడ్యూరప్పకు సంబంధించిన కేసును విచారించనుంది. కాగా.. సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో యడియూరప్పపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, దీనికి సంబంధించిన అన్ని పత్రాలను జస్టిస్ నాగమోహన్ దాస్ కమిషన్కు అందజేయాలని యత్నాల్ను కోరారు.
Read Also: AP High Court: ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ
బీజేపీ హయాంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన 40 శాతం కమీషన్ ఆరోపణలకు యత్నాల్ చేసిన ఆరోపణలే నిదర్శనమని సిద్ధరామయ్య తెలిపారు. 40 శాతం కమీషన్పై తమ వాదనకు యత్నాల్ ప్రత్యక్ష రుజువును ప్రభుత్వానికి అందించారని ముఖ్యమంత్రి చెప్పారు. అక్రమాలపై విచారణ జరిపే జస్టిస్ నాగమోహన్ దాస్ కమిషన్కు పత్రాలను అందజేయాలని యత్నాల్ను కోరుతూ, “అవినీతిని నిర్మూలించాలనే నిజమైన ఉద్దేశ్యం యత్నాల్కు ఉంటే, ఆయన తన ఆరోపణలను తార్కిక ముగింపుకు తీసుకెళ్లాలి” అని సిద్ధరామయ్య తెలిపారు.
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!