Bapatla : ‘తాగొచ్చి మా అమ్మను కొడుతున్నాడు.. మా నాన్నను జైల్లో వేయండి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bapatla : బాపట్ల జిల్లా కర్లపాలెంలోని పోలీస్ స్టేషన్లో విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సైకు తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తల్లి బాధ చూడలేక తన సమస్యను ధైర్యంగా ఎస్సైకు వివరించాడు. తన తల్లిని తండ్రి ఇబ్బందులు పెడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ చిన్నోడి ధైర్యానికి పోలీసులు షాక్ తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
Read Also:Manipur Violence: అదుపులో మణిపూర్ పరిస్థితి.. మరిన్ని బలగాలు మోహరింపు..
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కర్లపాలెం పాత ఇస్లాంపేటకు చెందిన సుభానీ, సుభాంబీ భార్యాభర్తలు.. వారిద్దరికి ఓ కుమారుడు ఉన్నాడు. సుభాని రైస్ మిల్లులో పనిచేస్తాడు.. అలాగే కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. సుభానీ రోజు మద్యం తాగుతాడు. అనంతరం రోజూ రాత్రిళ్లు ఇంటికి వచ్చి భార్యను దారుణంగా వేధించేవాడు. తండ్రి సుభాని తల్లిని రోజూ కొట్టడం చూసి తొమ్మిదేళ్ల కుమారుడు రహీమ్ తట్టుకోలేకపోయాడు. తల్లి బాధను చూడలేకపోయాడు. తండ్రి ఇలా చేయకుండా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే నేరుగా స్థానిక పోలీసుస్టేషన్కు వెళ్లాడు. తన తల్లితో తండ్రి ప్రవర్తిస్తున్న తీరును ఎస్సైకు వివరించాడు. వెంటనే తండ్రి చేస్తున్న పని ఆపించాలని వేడుకున్నాడు. అతడిని పిలిచి మందలించాలని ఎస్సైను కోరాడు.
Read Also:SRH vs KKR : ప్రతీకారం తీర్చుకున్న కేకేఆర్.. పోరాడి ఓడిన సన్ రైజర్స్
బాలుడి ఫిర్యాదుతో ఎస్సై వెంటనే ఆ దంపతులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి అక్కడిన నుంచి పంపించేశారు. మొత్తానికి బాలుడు తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక పోలీస్ స్టేషన్కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..