Vizag Kapunadu Public Meeting: విశాఖలో కాపునాడు బహిరంగసభ.. సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సాగరతీరం ఇవాళ కాపునాడు బహిరంగ సభతో వేడెక్కనుంది. రాధా-రంగా రీ యూనియన్ ఛలో వైజాగ్ కు పిలుపు నిచ్చింది. వంగవీటి మోహన్ రంగా జయంతిని పురస్కరించుకుని వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 34ఏళ్ళ తర్వాత మరోసారి కాపునాడు జరగనుంది. కాపుల ఐక్యత ప్రధానంగా తలపెట్టిన ఈ సభలో ఎటువంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంవీపీ కాలనీలోని ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో భారీ డయాస్ ఏర్పాటు చేశారు. 2500మంది సీటింగ్ కోసం కుర్చీలు వేశారు. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నాయకత్వం అంతా ఈ సభకు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: Gudivada Tension: గుడివాడలో టెన్షన్.. టెన్షన్
Also Read
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
- EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
మరోవైపు., పోస్టర్ రిలీజ్ లో పాల్గొన్న మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సభకు వస్తారా….?.రారా…!!? అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 26న భారీ ఎత్తున కాపులతో సభను నిర్వహిస్తుండడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ సభకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాపు సోదరులు తరలిరానున్నారు. కాపునాడు మహాసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్నారు. ఈ సభ ద్వారా ఏపీలో కాపులకు ఉన్న ప్రాధాన్యతను రాజకీయపార్టీలకు తెలియచేస్తామంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో కాపుల పాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అనే విషయాలు చర్చించకుండా సభ సాగదు అని అంటున్నారు.ఈ సభకు సంబంధించి వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. అంతే కాదు వారి ఫోటోలను కూడా ఆహ్వాన పత్రాలలో ముద్రించడం విశేషం. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమరనాథ్, విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖఅనకాపల్లి వైసీపీ జిల్లాల ప్రెసిడెంట్లు అయిన పంచకర్ల రమేష్ బాబు కరణం ధర్మశ్రీలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సహా వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు అందాయి. మరీ వీరంతా వస్తారా? వస్తే వారేం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది.
ఈ సభలో తెలుగుదేశం జనసేన నేతలు కూడా వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. కాపునాడులో కాపులకు సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ మళ్లీ చర్చకు వస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు ముఖ్యమంత్రి అన్న ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం నుంచి కిమిడి కళా వెంకటరావుతో పాటు పలువురు సీనియర్ నేతలను పిలిచారు. జనసేన నుంచి కూడా పలువురు నాయకులు హాజరవుతున్నారు. ఈ సభకు ఎవరెవరు వస్తారు? ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
Read Also:BIG Breaking: విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ బీభత్సం.. కార్లు, బైక్లపై దూసుకెళ్లడంతో..
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!