Kapil Dev: పిచ్ బాగుంటే కోహ్లీ కచ్చితంగా సెంచరీ చేస్తాడు: కపిల్ దేవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (12) ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు. అరంగేట్రం ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ వేసిన సాధారణ బంతికే అతడు పెవిలియన్ చేరడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమాధానమిచ్చాడు. అతడి సామర్థ్యంపై సందేహపడకూడదని కోహ్లీకి మద్దతిచ్చాడు. పిచ్ కొంచెం బాగున్నా కోహ్లీ సెంచరీ చేస్తాడని చెప్పాడు.
Also Read: Rohit Sharma- Rithika Sajdeh: రోహిత్ రికార్డు సెంచరీ.. భార్య రితిక పోస్ట్ ట్రెండింగ్
Also Read
- Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
ఈ సిరీస్లో కోహ్లీ ప్రభావం చూపిస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతడికి ఇంకా పరుగులు దాహం తీరలేదు. తొలి మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఒకవేళ అతడు పరుగులు చేయడం ఆరంభిస్తే తనదైన శైలిలో చేస్తాడు. మొదటి టెస్టుకు అతడి లాంటి స్టార్ ఆటగాడు ఎప్పుడూ ముఖ్యమే. అతడు 50 పరుగులు చేసినా.. ఈ సిరీస్లో అతడు మరో 2,3 శతకాలు చేస్తాడని నేను ఊహించగలను. టర్నింగ్ పిచ్లు గురించి వింటున్నాం. జట్లు 600 స్కోరు చేస్తుందని చెప్పలేం కానీ, ఒకవేళ చేస్తే ఇరుజట్ల బ్యాటర్లకు అనుకూలించవచ్చు. పిచ్లు బ్యాటర్ల చేతిలోనే ఉంటాయి. ఈ రోజుల్లో 60 శాతం పిచ్లు బౌలర్ల పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని 400 పరుగులు చేస్తాం అని చెప్పలేకపోవచ్చు. కానీ 220 నుంచి 250 మధ్య చేయొచ్చు. 350 స్కోరంటే చాలా పెద్దది ఫీలింగ్ కలుగుతుంది. పిచ్లు బాగుంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా పరుగులు చేస్తాడు” అని కపిల్ దేవ్ వెల్లడించాడు.
ఆసీస్ మరోసారి పేకమేడలా..
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా మంచి ఆధిక్యం సంపాదించింది. ఆస్ట్రేలియాను మొదట 177 రన్స్కే ఆలౌట్ చేసిన భారత జట్టు.. అనంతరం బ్యాటింగ్కు దిగి 400 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రెచ్చిపోగా.. అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) హాఫ్ సెంచరీలతో అలరించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 223 రన్స్ ఆధిక్యం సంపాదించింది. భారత స్పిన్నర్లు మరోసారి రెచ్చిపోతే భారత్కు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండానే విజయం వరించే అవకాశం ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. 42 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఖవాజా (5), వార్నర్ (10)తో పాటు లబుషేన్ (17), రెన్షా (2) పూర్తిగా నిరాశపర్చారు. అశ్విన్ 3 వికెట్లు తీయగా జడేజాకు ఒక వికెట్ దక్కింది.
Also Read: Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..
తాజావార్తలు
-
Preethizinta : ఎనిమిదేళ్ల విరామం తర్వాత బిగ్ స్క్రీన్పై ప్రీతి జింటా
-
Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
-
Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!