Site icon NTV Telugu

Kanna Laxminarayana: ఇసుక, మద్యం, గంజాయి మాఫియా నడుస్తోంది

Kanna

Kanna

ఏపీలో జగన్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత కన్నా‌ లక్ష్మీనారాయణ. నదీగర్బం లో ఇసుక తోడేస్తున్నారు..ఇసుక ఆదాయం సీయం జగన్ కు చేరుతుంది…ఫైన్ మాత్రం ప్రజల‌‌ సొమ్ము నుంచి చెల్లిస్తున్నారు.ఇసుక లో వాటాలు అందలేదని యం ఎల్ ఏ లే కోర్టు లో కేసులు పెట్టించారు…ఇసుక , మద్యం జగన్ తానొక్కడే దోచుకుంటున్నారు..జగన్ పాలనలో కలెక్టర్ లకు సైతం రెండు లారీల‌‌ ఇసుక సంపాదించుకో లేక పోతున్నారు..నదీ గర్బలాలో ఇసుకను అడ్డగోలుగా తవ్వడంతో పర్యవరణ సమస్య తలెత్తింది.పర్యావరణానికి విఘాతం కలిగించారని 450 కోట్లు ఫైన్ విధించారు.

Read Also:Harish Rao: మూడో స్థానంలో ఉన్నాం.. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంది

తాను అధికారంలోకి‌ వస్తే ఇసుక పాలసీ అద్బుతంగా ఉంటుదని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలు ఇసుకను ఆపివేశారు. 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. ముత్తాయపాలెం ఇసుక రీచ్ కు పర్మీషన్ లేకపోయినా నదిలోకి రోడ్డు వేసి తవ్వేస్తున్వారు. పవిత్ర తిరుమలలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని మండిపడ్డారు కన్నా.

Read Also: Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు

Exit mobile version