Harish Rao: మూడో స్థానంలో ఉన్నాం.. మొదటి స్థానానికి వెళ్లాల్సిన అవసరం ఉంది
Minister Harish Rao Lays Foundation Stone To MCH Hospital AT NIMS: రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గుముఖం పట్టాయని, ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని మంత్రి హరీశ్రావు తెలియజేశారు. ఎర్రమంజిల్లో నిమ్స్కు అనుబంధంగా 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన.. ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. గతంలో రాష్ట్రంలో కేవలం మూడు ఎంసీహెచ్ ఆసుపత్రులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 27కు పెరిగిందని అన్నారు. ఎంసీహెచ్ ఆసుపత్రుల నిర్మాణానికి రూ. 499 కోట్లు ఖర్చు చేశామని తెలిపిన ఆయన.. ఈ ఆసుపత్రులను 27కి పెంచడం వల్లే మాతాశిశు మరణాలు తగ్గాయన్నారు.
Bhatti Vikramarka: తెలంగాణ లక్ష్యాలు నెరవేరలేదు.. కేసీఆర్ మోసం చేశారు
Also Read
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
తెలంగాణ ఏర్పడక ముందు మాతా మరణాలు ప్రతి లక్షకు 92, శిశు మరణాలు 36గా ఉండేవని.. ఇప్పుడు ఆ సంఖ్యలు వరుసగా 43. 21కి తగ్గించుకున్నామ్నారు. ఈ మరణాల రేటు తగ్గుముఖం పట్టడంలో దేశంలో మూడోస్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి వెళ్లాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో 200 పడకలు, నిమ్స్లో 200 పడకలు, అల్వాల్లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రుల్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలోకి కానీ 100 పడకల డయాలసిస్ యూనిట్ లేదని.. నిమ్స్లో కేవలం 34 డయాలసిస్ బెడ్లు ఉండగా, వాటిని 100కు పెంచుకుంటున్నామని చెప్పారు. డయాలసిస్ రోగులను కాపాడుకునేందుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని.. ఆసరా పెన్షన్లు, ఉచిత బస్పాస్లను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులను కూడా పెంచుతున్నామన్నారు.
Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి
అనంతరం నిమ్స్లో కొత్తగా నియామకమైన 26 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా.. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఉద్యోగంలో చేరడం ఎంతో గౌరవాన్ని ఇస్తుందన్నారు. నిమ్స్లో తొలిసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వుమెన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. ఇంతవరకు నిమ్స్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండేది కాదని.. సీఎం కేసీఆర్ సూచన మేరకు అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. నిమ్స్కు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారని.. అలాంటి వారికి మంచి వైద్యం ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు. రోగుల పట్ల ప్రేమ, మమకారం, ఆప్యాయత చూపిస్తే.. అది రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టుకోకుండా.. టీమ్ వర్క్గా పని చేయాలని, ప్రజల కోసం పని చేయాలని, అప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని సూచించారు.
తాజావార్తలు
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!