Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Chandrababus Allegations Are For Political Gain Says Ys Jagan

YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు

Published Date :September 27, 2024 , 4:49 pm
By Mahesh Jakki
  • రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు
  • దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారు
  • రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారు
  • ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించిన వైఎస్ జగన్
YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YS Jagan: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేశారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు. దగ్గరుండి కావాలని అబద్ధాలు చెప్పించి అనుమాన బీజాలు నాటారన్నారు. ప్రసాదం తినేవారిలో అనుమానాలు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వార్థం కోసం స్వామివారి విశిష్టతను దెబ్బతీస్తున్నారన్నారు. యానిమల్ ఫ్యాట్‌తో ప్రసాదాన్ని తయారు చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. రోజుకో అబద్ధాన్ని ప్రమోట్ చేస్తున్నారన్నారు. 2015-108 వరకు చంద్రబాబు హయాంలో నందిని డెయిరీ బ్రాండ్‌ను ఎందుకు వాడలేదని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో కూడా నందిని డెయిరీ సంస్థ అప్పుడప్పుడు టెండర్లలో పాల్గొందని తెలిపారు. 2015-19 మధ్య ఏ రేటు నెయ్యిని కొన్నారని ఆయన ప్రశ్నలు గుప్పించారు.

Read Also: YS Jagan: రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..

Also Read

  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

అప్పటి నుంచి ఇప్పటివరకు అవే డెయిరీలు, అవే ధరలు, అదే నెయ్యి అని ఆయన తెలిపారు. ఉన్న రేటు రూ.320 అయినప్పుడు కొంటే తప్పేంటని పేర్కొన్నారు. మీ హయాంలో కూడా ఇదే రేటుకు నెయ్యి కొన్నారన్నారు. నెయ్యి రేట్లు పెంచి హెరిటేజ్‌కు లాభం చేకూర్చాలని చంద్రబాబు అనుకున్నారని జగన్ ఆరోపించారు. తప్పులను జనం నిలదీయడంతో చంద్రబాబు టాపిక్ డైవర్ట్ చేశారని విమర్శించారు. నా కులం, నా మతం ఏంటో ప్రజలకు తెలియదా అంటూ జగన్ అన్నారు. గతంలో తన తండ్రి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. నేను ఆయన కొడుకునే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పాదయాత్ర ముగిశాక కూడా స్వామివారిని దర్శించుకున్నానని జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అప్పుడు ప్రభుత్వం నడుపుతుంది చంద్రబాబే కదా అంటూ వెల్లడించారు. తిరుమలకు వెళ్లకూడదని ఇప్పుడు నోటీసులు పంపుతున్నారని తెలిపారు.

ఒక సీఎంగా ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని తిరుమలకు వెళ్లకూడదని అంటారా అంటూ జగన్ ప్రశ్నించారు. మతం ఏంటని ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని.. బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తానన్నారు. తన మతం మానవత్వమని జగన్ పేర్కొన్నారు. డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండన్నారు. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. గుడికి వెళ్లాలని అనుకుంటే ఏ మతం అని అడుగుతున్నారన్నారు. ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే.. దళితుల పరిస్థితి ఏంటన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమన్నారు. హిందూయిజానికి మేమే ప్రతినిధులమని బీజేపీ చెప్పుకుంటుందన్నారు. కూటమిలోని వ్యక్తి తిరుమలను, లడ్డూపై తప్పుడు ప్రచారం చేస్తుంటే బీజేపీ ఎందుకు మందలించట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబును మీరెందుకు వెనకేసుకొస్తున్నారని.. ఇదే హిందుత్వమని ప్రశ్నలు గుప్పించారు. చెడు చేసే వారిని మంచి హిందువుగా గుర్తించనన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • telugu news
  • Tirumala Laddu Controversy
  • Tirumala Laddu Issue
  • Tirumala Laddu Row

తాజావార్తలు

  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..

  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions