Kamal Haasan: ఎన్నికల్లో లబ్ధికోసమే బీజేపీ సీఏఏను తెచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వంపై సినీ నటుడు ఎంఎన్ఎం పార్టీ చీఫ్ కమల్ హాసన్ ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు ప్రజలను విభజించి.. భారతదేశ సామరస్యాన్ని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనే తపనతో.. ఎన్నికల సందర్భంగా సీసీఏను హడావుడిగా తెచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ఈ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి.. నోటిఫికేషన్ని విడుదల చేసిన సమయం మరింత సందేహాస్పదంగా ఉందని కమల్ హాసన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ చట్టం అణగారిన మతపరమైన మైనారిటీలను రక్షించడానికి ఉద్దేశించినట్లైతే.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న శ్రీలంక తమిళులను సీఏఏ పరిధిలోకి ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభలో తీర్మానాలు ఆమోదించడంలో.. ఇతర రాష్ట్రాల కంటే తమిళనాడు ముందంజలో ఉందని అన్నారు. ఈ చట్టంపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన కేంద్ర ప్రభుత్వం.. సరిగ్గా రంజాన్ నెల ప్రారంభానికి ఒక రోజు ముందు దీనిని అమల్లోకి తెచ్చిందని.. ముస్లిం సోదరులకు చేదువార్తను అందించిందని మండిపడ్డారు.
తన ఎంఎన్ఎం పార్టీ సీఏఏని వ్యతిరేకించిందని, సుప్రీంకోర్టులో దీనిని సవాలు చేసిన మొదటి వ్యక్తి తానేనని కమల్ హాసన్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ముందే హడావుడిగా ఈ చట్టాన్ని అమలు చేయడం.. బీజేపీ దుర్బుద్ధికి నిదర్శమని కమల్ హాసన్ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వాస్తవికతను విస్మరించడం ఖండించదగిన విషయమని.. మనమంతా కలిసికట్టుగా కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కమల్హాసన్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!