Kakrla Suresh: ఓటు వేయండి.. చెప్పింది చేయకపోతే నిలదీయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరి మండల కేంద్రంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకర్ల సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉండవల్లి భరత కుమార్ యాదవ్, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గం గత 40 సంవత్సరాలుగా వెనకబడిపోయిందని, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో వలసలు పెరిగాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి రావాలని తెలిపారు. 25 సంవత్సరాల ప్రణాళికతో ఇక్కడికి రావడం జరిగిందని.. 25 సంవత్సరాల కాలంలో అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని.. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని.. ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల జోలికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేయడంతో పాటు.. మీకు తెలిసిన వారందరి చేత ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
Also Read
Kakarla Suresh: నూతన వధూవరులను ఆశీర్వదించిన కాకర్ల సురేష్..
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. రాక్షస పాలన అంతమొందించడానికి తామంతా కంకణబద్ధులమై ఉన్నామని, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని ఆరోపించారు. మద్యం ఇసుక మైనింగ్ తో పాటు డ్రగ్స్ రాష్ట్రంగా తయారైందని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇంటికి పంపుతామని ఘంటాపదంగా తెలిపారు. ప్రతి బీజేపీ నాయకుడిని కార్యకర్తలను అక్కున చేర్చుకొని అన్నదమ్ముల వలే ప్రేమించాలని కాకర్ల సురేష్ కు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ కలిగిన కమలదళం వీర సైనికులై.. తన విజయానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ను మండలాలు వారిగా శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉదయగిరి నియోజకవర్గస్థాయి బీజేపీ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం మండల కన్వీనర్ బయన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, సురేష్ రెడ్డి, సురేందర్, ఆర్డీవిల్సన్, కందుకూరు నారాయణ, ఆంజనేయులు రెడ్డి, కె. బుచ్చిరెడ్డి, హనుమారెడ్డి, పులిచెర్ల నారాయణరెడ్డి, యం. బ్రహ్మారెడ్డి, వడ్డే శ్రీనివాసరెడ్డి, కే. మురళి నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆండ్రా పరంధామ రెడ్డి, బి. మహేందర్ రెడ్డి, బి. సుబ్బరాయుడు, వెంకటస్వామి నాయుడు, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, చుండు హరి గోపాల్ రెడ్డి, డేగ మధు యాదవ్, మల్లికార్జున, చంద్రమౌళి, చంద్రమౌళి, సింగాల రమణయ్య, ఎం. బాలకృష్ణారెడ్డి, పి. నారాయణ రెడ్డి, నందనవనం ప్రభాకర్ రావు, తిరుపతిరెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?