Kakarla Suresh : యువతకు జాబు కావాలంటే చంద్రబాబు రావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు వరికుంటపాడు మండలం విరువూరు, కొండాయపాలెం, ధర్మవరం, తోటల చెరువుపల్లి, మహ్మదాపురం, కృష్ణంరాజు పల్లి, తొడుగుపల్లిలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ కాలనీలలో ఎన్నికల ప్రచారాన్ని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లె జనం నీరాజనాలు పలికారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తామని, ఘంటా పదంగా తెలిపారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అమృత దార ద్వారా జిల్లా వ్యాప్తంగా 150 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫ్లోరిడ్ సమస్యను అధికమిస్తున్న ప్రజాసేవకుడు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అను నన్ను ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 వేల కిలో మీటర్ల సిమెంట్ రోడ్డు వేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. నాలుగు లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో 11 లక్షల 80 వేల ఇల్లు నిర్మించిన ఘనత చంద్రబాబుది అన్నారు. రాష్ట్రంలో లక్షలాది కంపెనీలను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు అంధకారం కావడంతో బ్రతుకు భారమై ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి తయారయిందన్నారు. మే 13న జరగనున్న భీకర యుద్ధంలో పసుపుదళం వీర సైనికులై పోరాటం చేసి తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న సాక్షిగా చెబుతున్నాను వచ్చేది చంద్రన్న ఉదయగిరిలో గెలిచేది తెలుగుదేశం అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని, మార్పు తీసుకొస్తానని పాలకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని కాకర్ల సురేష్ తెలిపారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ప్రతి గ్రామంలో ఆ గ్రామ నాయకులు ఆధ్వర్యంలో గజమాలతో శాలువాలతో పూలమాలలతో కాకర్ల సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీ నారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు కామేపల్లి వెంకటరత్నం, జడ్పీటీసీ సభ్యులు రావెళ్ళ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ వెంకయ్య, ఉమామహేశ్వరరావు, గ్రామ నాయకుడు పేరం సుధాకర్ రెడ్డి, పావులూరి రవీంద్రబాబు రాయుడు, పావులూరి మాలకొండయ్య, వేణుగంటి గంగయ్య, ఆండ్రా బాల గురువారెడ్డి, కాకి ప్రసాదు, గుంటుపల్లి నాగభూషణం, సర్పంచ్ వెనుగు వెంకటేశ్వర్ రెడ్డి, తెలుగుదేశం- జనసేన- బీజేపీ ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!