Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?
- బాలకృష్ణ రెడ్డి ఇంటిని పరిశీలించిన కాకాని గోవర్ధన్ రెడ్డి
- మంత్రి నారాయణకు కౌంటర్ వేసిన కాకాని
- అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డిలు పరిశీలించారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కూలగొట్టారు. 40 సంవత్సరాలుగా ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఇంటిని ఆధునికీకరించారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని నారాయణ తెలుసుకోవాలి. నారాయణ మంత్రి అయిన తర్వాత రకరకాల జీవోలు తీసుకువచ్చారు. వైసీపీ వాళ్ల ఇళ్లను కూల్చేస్తామని, టీడీపీ వారి జోలికిపోమని కూడా జీవో తీసుకురావాలి’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
- Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
- Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
- Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
Also Read: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్!
‘ప్రజల ఓట్లు వేసి గెలిపించింది ఇందు కోసమా?. ఇంటి అంశం న్యాయస్థానంలో ఉన్నా కూలగొట్టారు. కొందరు మున్సిపల్ అధికారులు ఎగిరిపడుతున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము. ఇలాంటి అధికారుల అంతు చూస్తాం. నారాయణ మెడికల్ కళాశాల కింద కూడా చాలా కాలువలు పోతున్నాయి. మెడికల్ కళాశాల కూడా కూలిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందున మీ కళాశాల జోలికి రాలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి’ అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్ ఇప్పట్లో కోలుకోవా..?
-
Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్ను జయించిన నెతన్యాహూ..
-
Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!