Kakani Govardhan Reddy: సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?
- బాలకృష్ణ రెడ్డి ఇంటిని పరిశీలించిన కాకాని గోవర్ధన్ రెడ్డి
- మంత్రి నారాయణకు కౌంటర్ వేసిన కాకాని
- అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన వైసీపీ నేత బాలకృష్ణ రెడ్డి ఇంటిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి చంద్ర శేఖర్ రెడ్డిలు పరిశీలించారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణారెడ్డి ఇంటిని కూలగొట్టారు. 40 సంవత్సరాలుగా ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఇంటిని ఆధునికీకరించారు. సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులను పగలగొట్టడమా?. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని నారాయణ తెలుసుకోవాలి. నారాయణ మంత్రి అయిన తర్వాత రకరకాల జీవోలు తీసుకువచ్చారు. వైసీపీ వాళ్ల ఇళ్లను కూల్చేస్తామని, టీడీపీ వారి జోలికిపోమని కూడా జీవో తీసుకురావాలి’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
- NEET UG 2026: మే 3న నీట్ పరీక్ష, మే 12న రద్దు.. అసలు ఈ 10 రోజుల్లో ఏం జరిగింది? పూర్తి టైమ్లైన్ ఇదే..
Also Read: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్గా ఏబీ డివిలియర్స్!
‘ప్రజల ఓట్లు వేసి గెలిపించింది ఇందు కోసమా?. ఇంటి అంశం న్యాయస్థానంలో ఉన్నా కూలగొట్టారు. కొందరు మున్సిపల్ అధికారులు ఎగిరిపడుతున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులను మరచిపోము. ఇలాంటి అధికారుల అంతు చూస్తాం. నారాయణ మెడికల్ కళాశాల కింద కూడా చాలా కాలువలు పోతున్నాయి. మెడికల్ కళాశాల కూడా కూలిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నందున మీ కళాశాల జోలికి రాలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలి’ అని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
-
LPG Subsidy Cut: సామాన్యుడికి గ్యాస్ షాక్.. ఇకపై సబ్సిడీ కట్!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్ట్.. సీఎం విజయ్ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!