Kadiyam Srihari: కాంగ్రెస్-బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఉచిత పథకాలు ఉన్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గ్రామస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆవకాశం నాకు కల్పించారు.. నాకు ఛాన్స్ ఇచ్చిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో, పల్లా రాజేశ్వర్ రెడ్డితో, ముఖ్య నాయకులు అందరితో మాట్లాడుతున్నాను అని ఆయన తెలిపారు. 2009 నుంచి 2014 వరకు స్టేషన్ ఘనపూర్ ప్రజలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నారు.. నియోజకవర్గానికి ఎంత సేవ చేసిన తక్కువే, నియోజకవర్గ ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అని కడియం శ్రీహరి అన్నారు.
Read Also: Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పదవులు రావడం ఈ నియోజకవర్గం ప్రజలు పెట్టిన భిక్షే అంటూ కడియం శ్రీహరి అన్నారు. ఎవరిని మోసం చేసే గుణం నాది కాదు.. పనులు ఇస్తా అని పదవులు ఇస్తానని డబ్బులు తీసుకునే అలవాటు నా దగ్గర లేదు అని ఆయన పేర్కొన్నారు. ఏ పని చేసిన నిజాయితీగా చేస్తా.. మీకు గౌరవం దక్కే విధంగా ఉంటాను తప్ప, తలవొంపులు తీసుకురాను.. కాంగ్రెస్-బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో రైతులకు ఉచిత పథకాలు అందుతున్నాయా అని కడియం ప్రశ్నించారు. అన్నమో రామచంద్ర అన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు.
Read Also: CAG Report: అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక.. రాజధాని కోసం భూసేకరణను ఎండగట్టిన కాగ్..
తుక్కుగూడ బహిరంగ సభలో ఇచ్చిన ఆరు హామీలను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నారా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. బీజేపీ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు.. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ నెంబర్ కే పరిమితమై ఉంటుంది.. కానీ వాళ్ళ మాటలు మాత్రం కోటలు దాటుతాయి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా కొట్లాడుకుంటారో మన అందరికీ తెలుసు.. కాంగ్రెస్ పార్టీకి తప్పుదారి ఓటు వేస్తే ఆగమైతాం సుమా.. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను ఆగం చేసుకున్నట్లేనని ఆయన చెప్పారు. ప్రజల మధ్యలో ఉంటే.. పనితీరు మంచిగా ఉంటే, నాయకులను ప్రజలు కడుపులో పెట్టి చూసుకుంటారు.. మంచి పనులు చేస్తే ప్రజలే మనల్ని కోరుకుంటారు.. దానికి ఉదాహరణ నేనే.. నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకోవడం.. నీతిగా నిజాయితీగా ఉంటే అవకాశం వస్తుందని కడియం శ్రీహరి అన్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..