Jupally Krishna Rao : పర్యాటకంలో మౌలిక వసతులకు పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు.
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకుతగ్గ వసతులు ఉండాలని, ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కలిపించినప్పుడే ఆది సాధ్యపడుతుందని చెప్పారు. ప్రైవేట్ కు ధీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలని, ఆక్సుపెన్సీ రేషియో పెంచుకునేలా వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఆదాయంలో ప్రైవేటు హోటల్స్ తో పోటీ పడాలని, ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించి, ఇతర శాఖలకు మార్గదర్శకంగా నిలవాన్నారు. పర్యాటక శాఖను మరింత లాభాల బాట పట్టించేందుకు నిబద్ధతతో పని చేయాలని అధికారులకు హితవు పలికారు.
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, మంచి ఫలితాలు వచ్చేలా సమిష్టిగా అధికారులందరూ పని చేయాలన్నారు. అంతకుముందు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది మంత్రి జూపల్లికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్) శాంతి, జనరల్ మేనేజర్ (అడ్మిన్) రవీందర్ నాయక్, జనరల్ మేనేజర్ ( టూర్స్) తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!