Jupally Krishna Rao : పర్యాటకంలో మౌలిక వసతులకు పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆక్టుకునేలా తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అబ్కారీ, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేట లోనిహరిత ప్లాజా లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లు, హరిత హోటల్స్ నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారామంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆద్వర్యంలో చేపట్టిన ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్దిష్ట కాల వ్యవధిని నిర్దేశించుకొని, దానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని, నాణ్యతలో రాజీ పడవద్దని సూచించారు.
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకుతగ్గ వసతులు ఉండాలని, ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయి సౌకర్యాలు కలిపించినప్పుడే ఆది సాధ్యపడుతుందని చెప్పారు. ప్రైవేట్ కు ధీటుగా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దాలని, ఆక్సుపెన్సీ రేషియో పెంచుకునేలా వినూత్న మార్గాలను అన్వేషించి ఆదాయం పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఆదాయంలో ప్రైవేటు హోటల్స్ తో పోటీ పడాలని, ప్రభుత్వంపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించి, ఇతర శాఖలకు మార్గదర్శకంగా నిలవాన్నారు. పర్యాటక శాఖను మరింత లాభాల బాట పట్టించేందుకు నిబద్ధతతో పని చేయాలని అధికారులకు హితవు పలికారు.
Also Read
- PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన 'వాంఖేడే' పోరు..
- Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
- CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
- Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
కొత్త సంవత్సరంలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని, మంచి ఫలితాలు వచ్చేలా సమిష్టిగా అధికారులందరూ పని చేయాలన్నారు. అంతకుముందు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది మంత్రి జూపల్లికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, జనరల్ మేనేజర్ ( ఫైనాన్స్) శాంతి, జనరల్ మేనేజర్ (అడ్మిన్) రవీందర్ నాయక్, జనరల్ మేనేజర్ ( టూర్స్) తదితర అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!