Judge Delivery at Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ సివిల్ జడ్జి డెలివరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, కలెక్టర్లు అంటే ఖరీదైన వైద్యం అందుకుంటారని అపవాదు నిన్నమొన్నటివరకూ ఉంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల తీరు మారిపోయింది. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ దవాఖానాలు అన్ని సౌకర్యాలతో రోగులకు సకల సదుపాయాలు అందిస్తున్నాయి. అందుకే బ్యూరోక్రాట్లు, న్యాయవ్యవస్థ, పోలీసు శాఖలకు చెందినవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరి ప్రసవాలకు కూడా సిద్ధం అవుతున్నారు. తాజాగా ఓ జూనియర్ సివిల్ జడ్జి ఒకరు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Read Also: Google Search: ఏషియన్ టాప్-5లో ముగ్గురు భారతీయులు
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి శాలిని పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు జడ్జి షాలినినీ కలిశారు. ఆమెను, బిడ్డను చూసి, ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సర్కారు దవాఖానాలను సీఎం కేసీఆర్ బలోపేతం చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సిజేరియన్లు చేయకుండా.. నార్మల్ డెలివరీలు చేయడానికి వైద్యులు కృషి చేయాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. నార్మల్ డెలివరీ చేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వం. సంపన్నులు కూడా ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారని అధికారులు అంటున్నారు.


గతంలోనూ తెలంగాణలో ఉన్నతాధికారుల భార్యలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మూడునెలల క్రితం ఓ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నార్మల్ డెలివరీకి ప్రయత్నించినా.. కుదరకపోవడంతో సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు. తాజాగా జూనియర్ సివిల్ జడ్జి శాలిని మరింతమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేనికీ తీసిపోవని ఆమె నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.
Read Also: Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్
తాజావార్తలు
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!