ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. దేవరతో సాలిడ్ హిట్ అందుకుని తన మార్కెట్ ను నార్త్ లోను పదిలం చేసుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన వార్ తో ప్లాప్ అందుకున్న ఎన్టీఆర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : Funky : బూతులు తిట్టేసే విశ్వక్ సేన్ కాదు.. ఇప్పుడు తను మారాడు : నాగవంశీ
దేవర సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ నేడు జోర్డాన్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను మరియు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను జోర్డాన్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ లాంగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు మలయాళ నటుడు తోవినో థామస్ కూడా పాల్గొననున్నారు. ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ మునుపటి కంటే చాలా వైల్డ్ గా మరియు పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. దీని కోసం తారక్ ప్రత్యేకమైన మేకోవర్ కూడా అయ్యారు. జోర్డాన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. ఎయిర్పోర్ట్ వీడియోలో ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్గా కనిపిస్తుండటంతో నందమూరి అభిమానులు ఆ వీడియోను తెగషేర్ చేస్తున్నారు.
జోర్డాన్ బయలుదేరిన #JrNTR అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారు. మళయాల హీరో టోవినో కూడా ఈ షూట్ లో పాల్గొంటారు.. #ManOfMassesNTR #JrNTR #Dragon
— తార-సితార (@Tsr1257) February 8, 2026