Jowar Murukulu Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. బియ్యపుపిండి వాడకుండా కరకరలాడే జొన్న మురుకులు ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- బియ్యపుపిండి లేకుండా జొన్న మురుకులు తయారీ
- హెల్తీ, తేలికగా జీర్ణమయ్యే స్నాక్
- డయాబెటిస్, వెయిట్ లాస్కు అనుకూలమైన వంటకం
- జొన్న పిండి ప్రధాన పదార్థంగా ఉపయోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Murukulu Recipe: ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రుచికరమైన స్నాక్స్ తినాలనుకునే వారికి జొన్న పిండి మురుకులు ఒక బెస్ట్ ఛాయస్. సాధారణంగా మురుకులు అంటే బియ్యపుపిండి గుర్తుకు వస్తుంది. కానీ, జొన్న పిండితో చేసిన మురుకులు మరింత పోషక విలువలతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్తీ స్నాక్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. తక్కువ జిగురు ఉండే జొన్న పిండితో కూడా కొన్ని సులభమైన చిట్కాలతో కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా జొన్న పిండితో వంటలు చేసేటప్పుడు జిగురు తక్కువగా ఉంటుంది. కానీ, కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఎంతో రుచికరమైన మురుకులను మనం సిద్ధం చేసుకోవచ్చు.
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
Food Storage Tips : ఫ్రిడ్జ్లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!
కావలసిన పదార్థాలు:
* జొన్న పిండి: 1/2 కిలో (సుమారు 4 కప్పులు)
* పుట్నాల పప్పు (వేయించిన శనగపప్పు): 1 కప్పు (125 గ్రాములు)
* ధనియాలు: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* వాము: 1 టీస్పూన్
* నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు
* కారం: 2 టీస్పూన్లు
* ఇంగువ: 1/2 టీస్పూన్
* పసుపు: చిటికెడు
* ఉప్పు: రుచికి సరిపడా
* నూనె: వేయించడానికి సరిపడా
* వేడి నీళ్లు: పిండి కలపడానికి
తయారీ విధానం:
పిండి సిద్ధం:
ముందుగా ఒక మిక్సీ జార్ లోకి ఒక కప్పు పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోని జొన్న పిండిలోకి తీసుకోవాలి. పుట్నాల పిండి లేకపోతే ఒక కప్పు శనగపిండినైనా వాడుకోవచ్చు.
మసాలాలు కలపడం:
ఈ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, కారం, నువ్వులు, పసుపు, ఇంగువ వేయాలి. వామును చేతిలో వేసి కొంచెం నలిపి వేస్తే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
GST Scam: రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం బట్ట బయలు.. తెలుగు రాష్ట్రాలలో 72 షెల్ కంపెనీలు గుర్తింపు..!
వేడి నీళ్లతో పిండి కలపడం:
జొన్న పిండికి జిగురు రావాలంటే కచ్చితంగా వేడి నీళ్లను ఉపయోగించాలి. నీళ్లను వేడి చేసి, పిండిలో కొంచెం కొంచెంగా పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి. వేడి నీళ్ల వల్ల మురుకులు కరకరలాడుతూ వస్తాయి.
మురుకులు ఒత్తడం:
మురుకుల మెషిన్కు లోపల కొంచెం నూనె రాసి, సిద్ధం చేసుకున్న పిండిని అందులో ఉంచాలి. స్టౌ మీద బాండీ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక, నేరుగా నూనెలోకి మురుకులను ఒత్తుకోవాలి. జొన్న పిండి కాబట్టి రౌండ్ గా ఒత్తేటప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ నూనెలో వేయడం సులభం.
ఫ్రై చేయడం:
మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మురుకులను వేయించాలి. నూనెపై వచ్చే నురగ పూర్తిగా తగ్గిపోయే వరకు వేయిస్తేనే మురుకులు లోపలి వరకు వేగి క్రిస్పీగా ఉంటాయి. నురగ తగ్గిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకును నూనెలో వేయించి మురుకులపై వేసుకుంటే మంచి వాసనతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జొన్న మురుకులను మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!