నైజాం ఏరియా సినిమా పంపిణి రంగంలోకి మరొక సంస్థ అడుగుపెడుతోంది. బాలీవడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దురంధర్ కు సీక్వెల్ గా ధురంధర్ 2 వస్తోంది. ఈ సినిమా నైజాం హక్కులను జియో స్టూడియోస్ ఎవరికీ ఇవ్వకుండా సొంతగా రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాతో నైజాం మార్కట్ లో అడుగుపెడుతోంది జియో. నైజాం మార్కెట్లోకి నేరుగా అడుగుపెడుతూ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ సినీ నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న జియో స్టూడియోస్ ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కీ రోల్ పోషించేందుకు రెడీ అవుతున్నారు.
Also Read : Varanasi : ‘వారణాసి’.. రాజమౌళి.. మహేశ్ కు నో రెమ్యునరేషన్
ఇప్పటివరకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సినిమాలు విడుదల చేసిన ఈ సంస్థ, ఇప్పుడు నైజాం ఏరియాలో సొంతంగా పంపిణీ కార్యకలాపాలను ప్రారంభించింది. హైదరాబాద్లో కొత్తగా ఆఫీస్ ఏర్పాటు చేసింది జిఓ స్టూడియోస్. గతంలో PVR సినిమాస్లో ప్రోగ్రామర్గా పనిచేసిన మురళీ ద్వారా జియో తమ కార్యకలాపాలు మొదలుపెట్టింది. థియేటర్ల నెట్వర్క్ మరియు మూవీ ప్రోగ్రామింగ్పై ఆయనకు ఉన్న పట్టు జియో స్టూడియోస్ బిజినెస్కు ఇక్కడ ప్లస్ పాయింట్ కానుంది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ సినిమాను నైజాం ఏరియాలో మొదట PVR inox ద్వారా రిలీజ్ చేయాలనీ భావించి మరలా తమ సొంత ఆఫీస్ ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాతోనే నైజాం పంపిణీ రంగంలో తమ ముద్ర వేయాలని సంస్థ భావిస్తోంది. పెద్ద సంస్థలు ఇలా నేరుగా రంగంలోకి దిగడం వల్ల థియేటర్ల కేటాయింపు మరియు వసూళ్ల విషయంలో మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.