Telangana Governor: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్రవేశారు.. ఇక, తెలంగాణ గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతిలో పెట్టారు.. అంటే, జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్కు అప్పగించారు రాష్ట్రపతి..
Read Also: Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
కాగా, లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. తమిళనాడు నుంచి లోక్సభ బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారని చెబుతున్నారు.. బీజేపీ టికెట్పై లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.. సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. మొదట్లో అంతా సాఫీగా సాగినా.. ఆతర్వాత బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ గవర్నర్గా మారింది.. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళిసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు.. ఆ తర్వాత రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య చాలా విషయాలు బేధాభిప్రాయాలు వచ్చి.. రచ్చగా మారాయి.. ఇక, ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య కొంత సఖ్యత కనబడింది.. కానీ, గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై.
Read Also: Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య.. కూతురుని చంపిన తల్లి..?
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత.. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మల్కాజ్గిరిలో రోడ్షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాత్రి రాజ్భవన్లోనే బస చేశారు. అక్కడే తమిళిసైకి మోడీ లోక్సభ స్థానంపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయడం.. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.. ఇక, బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో తమిళిసై పేరు రావడమే మిగిలిపోయింది.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!