Telangana Governor: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్రవేశారు.. ఇక, తెలంగాణ గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతిలో పెట్టారు.. అంటే, జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్కు అప్పగించారు రాష్ట్రపతి..
Read Also: Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?
Also Read
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
కాగా, లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. తమిళనాడు నుంచి లోక్సభ బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారని చెబుతున్నారు.. బీజేపీ టికెట్పై లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.. సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. మొదట్లో అంతా సాఫీగా సాగినా.. ఆతర్వాత బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ గవర్నర్గా మారింది.. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళిసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు.. ఆ తర్వాత రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య చాలా విషయాలు బేధాభిప్రాయాలు వచ్చి.. రచ్చగా మారాయి.. ఇక, ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య కొంత సఖ్యత కనబడింది.. కానీ, గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై.
Read Also: Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య.. కూతురుని చంపిన తల్లి..?
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత.. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మల్కాజ్గిరిలో రోడ్షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాత్రి రాజ్భవన్లోనే బస చేశారు. అక్కడే తమిళిసైకి మోడీ లోక్సభ స్థానంపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయడం.. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.. ఇక, బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో తమిళిసై పేరు రావడమే మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్కే!
-
PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!