Telangana Governor: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. తెలంగాణ కొత్త గవర్నర్ ఈయనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదముద్రవేశారు.. ఇక, తెలంగాణ గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చేతిలో పెట్టారు.. అంటే, జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గానూ తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఆ బాధ్యతలను కూడా సీపీ రాధాకృష్ణన్కు అప్పగించారు రాష్ట్రపతి..
Read Also: Family Star : భారీ ధరకు సేల్ అయిన ఫ్యామిలీ స్టార్ ఓటిటి రైట్స్..?
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
కాగా, లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. తమిళనాడు నుంచి లోక్సభ బరిలో దిగేందుకే తమిళిసై రాజీనామా చేశారని చెబుతున్నారు.. బీజేపీ టికెట్పై లోక్సభకు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానం హామీతో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.. సెప్టెంబర్ 8, 2019న తెలంగాణ గవర్నర్గా తమిళిసై నియమితులయ్యారు. మొదట్లో అంతా సాఫీగా సాగినా.. ఆతర్వాత బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ గవర్నర్గా మారింది.. చాలా సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వంపై బహిరంగంగానే తమిళిసై వ్యాఖ్యలు చేయడం చర్చగా మారింది.. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై విమర్శలు గుప్పించారు.. ఆ తర్వాత రాజ్భవన్, ప్రగతి భవన్ మధ్య చాలా విషయాలు బేధాభిప్రాయాలు వచ్చి.. రచ్చగా మారాయి.. ఇక, ఆ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కూలిపోవడం… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వం, రాజ్భవన్ మధ్య కొంత సఖ్యత కనబడింది.. కానీ, గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళిసై.
Read Also: Honor Killing: ఇబ్రహీంపట్నంలో పరువుహత్య.. కూతురుని చంపిన తల్లి..?
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన తర్వాత.. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మల్కాజ్గిరిలో రోడ్షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ రాత్రి రాజ్భవన్లోనే బస చేశారు. అక్కడే తమిళిసైకి మోడీ లోక్సభ స్థానంపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఆ తర్వాత వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.. గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయడం.. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.. ఇక, బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితాలో తమిళిసై పేరు రావడమే మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!