Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jhandu Kumar: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ బోణీ కొట్టింది. తొలి పతకాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తొలి పతకం వెనుక ఉన్నది ఓ సామాన్య యువకుడి అసాధారణమైన పట్టుదల, కన్నీళ్లని తుడిచేసిన కఠోర శ్రమ! బీహార్లో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు, ఒకప్పటి ఈ-రిక్షా డ్రైవర్ అయిన 29 ఏళ్ల ఝండు కుమార్, గ్లాస్గోలో జరిగిన పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకాన్ని ముద్దాడి భారత్కు మొదటి పతకం అందించాడు. అంతకుముందు రోజు లైట్వెయిట్ విభాగంలో తృణమొలకలో పతకం చేజారి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత్కు, ఝండు కుమార్ ప్రదర్శన నిరాశను తుడిచేసి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి లిఫ్టర్లు పోటీపడిన ఈ ఈవెంట్లో ఝండు అద్భుతంగా రాణించాడు.
పారా పవర్ లిఫ్టింగ్లో పోటీదారుల శరీర బరువు, వారు ఎత్తే బరువును బట్టి సంక్లిష్టమైన స్కోరింగ్ పద్ధతి ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. సాధారణంగా గ్రూప్-Aలో పోటీపడే ప్లేయర్లకు శారీరక బరువు ఎక్కువ ఉండి, వ్యూహాత్మకంగా ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ గ్రూప్-B నుంచి బరిలోకి దిగిన ఝండు, ఈ సమీకరణాలన్నింటినీ తిరగరాశాడు. మొదటి నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన, తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును విజయవంతంగా ఎత్తి 130.9 పాయింట్లతో సగానికి పైగా పోటీ పూర్తయ్యేసరికి టాప్ ప్లేస్లో నిలిచాడు. తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు కంటే ఇది 8 కేజీలు తక్కువే అయినప్పటికీ, అతడి ప్రదర్శన తోటి పోటీదారులపై తీవ్ర ఒత్తిడి పెంచింది. చివరి ప్రయత్నంలో 196 కేజీల రికార్డు బరువు కోసం ప్రయత్నించి, బార్ రాక్కు తగలడంతో టైమింగ్ మిస్సై తృణప్రాయంలో ఆ అవకాశం కోల్పోయాడు. అయినప్పటికీ, అతడు సాధించిన 130.9 పాయింట్లే అతడికి కాంస్యాన్ని ఖాయం చేశాయి. భారత్కు తొలి పతకం అందించడం తనకు చాలా గర్వంగా ఉందని, త్రైవర్ణ పతాకాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఆనందం వేస్తోందని ఝండు మురిసిపోయాడు.
Also Read
పతకం గెలిచాక ఝండు భావోద్వేగానికి లోనవుతూ.. ఈ ఆనందాన్ని ముందుగా తన తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో కలిసి ప్రాక్టీస్ చేసిన గౌతమ్ భయ్యాకు పంచుకుంటానని తెలిపాడు. ఈ విజయం వెనుక ఝండు పడిన కష్టం వర్ణనాతీతం. బీహార్లోని నలంద జిల్లా హర్నౌత్కు చెందిన ఝండు పుట్టుకతోనే పోలియో బాధితుడు. రోడ్డు పక్కన ఆలుగడ్డలు, ఉల్లిపాయలు అమ్మే తండ్రికి ఆసరాగా ఉంటూ, కరోనా లాక్డౌన్ సమయంలో కుటుంబాన్ని పోషించడానికి ఈ-రిక్షా నడిపాడు. 2017లో పారా అథ్లెటిక్స్లో షాట్పుట్, డిస్కస్ త్రోతో తన క్రీడా ప్రయాణం ప్రారంభించినా, జిమ్లో సాధన చేస్తున్నప్పుడు పవర్ లిఫ్టింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు. 2023 నేషనల్ ఛాంపియన్షిప్కు వెళ్లడానికి డబ్బులు లేక తన ఈ-రిక్షాను కూడా అమ్మేసుకున్నాడు. ఆ టోర్నీలో విఫలమైనప్పటికీ, అతడిలోని ప్రతిభను పారా ఒలింపిక్ కాంస్య విజేత రాజిందర్ సింగ్ రహేలూ గుర్తించి గాంధీనగర్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడని ఝండు, 72 కేజీల విభాగంలో నేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తూ, 2025 బీజింగ్ వరల్డ్ కప్, 2026 ఆసియా అండ్ ఓషియానియా ఛాంపియన్షిప్లలో కాంస్యాలు సాధించాడు. ఇప్పుడు కామన్వెల్త్ పతకంతో దేశం గర్వపడేలా చేసిన ఈ నలంద వీరుడు.. తదుపరి లక్ష్యం లాస్ ఏంజెల్స్ 2028 పారాలింపిక్స్ అని బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు!
తాజావార్తలు
-
Jhandu Kumar: పోలియోను జయించి, పేదరికాన్ని తొక్కేసి.. భారత్కు తొలి పతకం అందించిన బీహార్ కుర్రాడి కన్నీటి గథ!
-
Love O Love OTT Release: థియేటర్ల నుంచి ఓటీటీలోకి ‘లవ్ ఓ లవ్’.. ధనుష్ మేనల్లుడు సినిమా ఎక్కడ చూడాలంటే?
-
TVS Orbiter: 158 KM రేంజ్తో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఆర్బిటర్’ విడుదల.. స్మార్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న EV
-
IND vs ZIM 2nd T20: సిరీస్పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!
-
NEET Protest Talks Today: నేడు సీజేపీ-ప్రభుత్వం మధ్య మూడో విడత చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఉత్కంఠ
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!