Jewellery Shop Robbery: నగల దుకాణంలో చోరీ.. కాల్పులు జరిపిన దుండగులు.. (వీడియో)
- రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ లో ఘటన.
- కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు.
- షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు.
బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ, ఇంకా మరొకరు కాల్చబడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ మృతి చెందాడు. దుకాణంలో జరిగిన ఈ దోపిడీ ఘటనను బయట నిలబడిన వ్యక్తులు వీడియో తీశారు. షోరూమ్ లో 5 మంది దుండగులు దోపిడి చేసి.. పారిపోతుండగా దుండగులు కాల్పులు జరిపారు. నేరస్థులు దుకాణంలో దొంగిలించడానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
దొంగలు దోపిడీ చేసేందుకు స్విఫ్ట్ కారులో వచ్చారు. దుకాణం సమీపంలోకి రాగానే అగంతకులు బయట 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం దుకాణదారునికి పిస్టల్ చూపించి షాపులో ఉంచిన నగలను దోచుకెళ్లాడు. అదే సమయంలో దుకాణదారుడు అరవడంతో దుండగులు అతడిని తీవ్రంగా కొట్టి, కాల్పులు జరిపి కారులో పారిపోయారు. ఘటనా స్థలానికి ఎస్పీ భివాడి జ్యేష్ట మైత్రీ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
चोर बेखौफ हो गए हैं और राजस्थान सरकार और पुलिस मौन हैं ।
ज्वेलरी शोरूम ,भिवाडी में चोर दिनदहाड़े घुसते हैं, लूटपाट करते हैं और हत्या कर देते हैं ,आखिर सरकार कब जागेगी ?
जनता की सुरक्षा को लेकर इतनी लापरवाही क्यों ? pic.twitter.com/t8sguiAJaE— VINOD JAKHAR (@VinodJakharIN) August 23, 2024
తాజావార్తలు
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!