Jewellery Shop Robbery: నగల దుకాణంలో చోరీ.. కాల్పులు జరిపిన దుండగులు.. (వీడియో)
- రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ లో ఘటన.
- కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు.
- షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు.
బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ, ఇంకా మరొకరు కాల్చబడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ జ్యువెలర్స్ యజమాని కమలేష్ సోనీ మృతి చెందాడు. దుకాణంలో జరిగిన ఈ దోపిడీ ఘటనను బయట నిలబడిన వ్యక్తులు వీడియో తీశారు. షోరూమ్ లో 5 మంది దుండగులు దోపిడి చేసి.. పారిపోతుండగా దుండగులు కాల్పులు జరిపారు. నేరస్థులు దుకాణంలో దొంగిలించడానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేసారు. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
దొంగలు దోపిడీ చేసేందుకు స్విఫ్ట్ కారులో వచ్చారు. దుకాణం సమీపంలోకి రాగానే అగంతకులు బయట 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం దుకాణదారునికి పిస్టల్ చూపించి షాపులో ఉంచిన నగలను దోచుకెళ్లాడు. అదే సమయంలో దుకాణదారుడు అరవడంతో దుండగులు అతడిని తీవ్రంగా కొట్టి, కాల్పులు జరిపి కారులో పారిపోయారు. ఘటనా స్థలానికి ఎస్పీ భివాడి జ్యేష్ట మైత్రీ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామన్నారు.
चोर बेखौफ हो गए हैं और राजस्थान सरकार और पुलिस मौन हैं ।
ज्वेलरी शोरूम ,भिवाडी में चोर दिनदहाड़े घुसते हैं, लूटपाट करते हैं और हत्या कर देते हैं ,आखिर सरकार कब जागेगी ?
जनता की सुरक्षा को लेकर इतनी लापरवाही क्यों ? pic.twitter.com/t8sguiAJaE— VINOD JAKHAR (@VinodJakharIN) August 23, 2024
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!