JD Lakshmi Narayana: ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Lakshmi Narayana: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి అంటూ పిలుపునిచ్చారు సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ.. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అనే ప్రచారం చేస్తున్నారు.. నమ్మకం పెట్టుకున్న మూడు పార్టీలు మోసం చేశాయి. ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంగా మారాలి అని ఆకాక్షించారు. ఇక, 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దని చెప్పలేదని గుర్తుచేశారు.. కానీ, అసమర్థతను వేరేవాళ్లపై నెట్టేసే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. నాలుగు సార్లు అద్భుతమైన అవకాశం వచ్చినా పార్టీలు పట్టించుకోలేదని.. కేంద్రం చెప్పిన చిలక పలుకులనే మన పాలకులు ఇక్కడ చెబుతున్నారు అంటూ దుయ్యబట్టారు వీవీ లక్ష్మీనారాయణ.
Read Also: Sharad Pawar: నా పార్టీని అన్యాయంగా లాగేసుకున్నారు.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్..
Also Read
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ఇక, ఒకరేమో ప్రత్యేకహోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు.. మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. ఇంకొకరు తలలు తెగిపడినా ఫర్వాలేదు.. కానీ, మేం పోరాడతాం అని అన్నారు.. కానీ, ప్రత్యేకహోదా రాలేదు, ప్యాకేజీ అందలేదు, మెడలు వంగలేదు, తలలు తెగిపడిందీ లేదు అంటూ గతంలో పాలక, ప్రతిపక్షాలపై లక్ష్మీనారాయణ ఫైర్ అయిన విషయం విదితమే.. నిరుద్యోగం పెరిగిపోయింది, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ప్రత్యేక హోదా అడగడానికి మూడు సార్లు అద్భుతమైన అవకాశం వచ్చినా.. కానీ అడిగే ధైర్యం చేయలేదని.. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక హోదా అడగడానికి అవకాశం ఇచ్చింది. కానీ, ప్రత్యేక హోదాపై అడిగే ధైర్యం ఎవరికీ లేకపోయిందని ఆయన ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!