Javed Akhtar: పాక్లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్లో జరిగిన ఉత్సవం కోసం జావేద్ అక్తర్ గత వారం పాకిస్థాన్ను సందర్శించారు.
ప్రఖ్యాత గీత రచయిత, ఒక పరస్పర చర్చ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. భారత్-పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని.. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని జావెద్ అక్తర్ అన్నారు. వాటిని తగ్గించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తాము ముంబయికి చెందిన వాళ్లమని అన్న జావెద్.. ముంబయిసో ఉగ్రవాదులు ఎలాంటి బీభత్సాన్ని సృష్టించారో కళ్లారా చూశామన్నారు. ఉగ్రవాదులు నార్వే లేదు ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదని.. పాకిస్తాన్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదని జావెద్ అక్తర్ వ్యాఖ్యానించారు.
Also Read
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Read Also: UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు అప్లై చేశారా.. గంటలే గడువు!
భారత ఆర్టిస్టులను పాక్లో గౌరవించకపోవడాన్ని జావెద్ అక్తర్ తప్పుబట్టారు. నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఆయన… కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. 2008 నవంబరు 26న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబయిలోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకోగా.. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.
పాకిస్థాన్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్లో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు హర్షం వ్యక్తం చేసిన వారిలో నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. జావెద్ అక్తర్ కవిత్వం వింటున్నప్పుడు తాను ఆశ్చర్యపోయినట్లు కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
So….. #javedakhtar sahab went to #Lahore for #FaizFestival2023 and said this! 👏🏻 👏🏻 👏🏻 👏🏻 👏🏻@Javedakhtarjadu sahab 🙏🏼 pic.twitter.com/X6x2Pcp3ef
— SATYA (@satyanas) February 20, 2023
Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳
Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF— Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023
తాజావార్తలు
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో