Javed Akhtar: పాక్లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ పాకిస్తాన్ను ఆ దేశంలోనే విమర్శించారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటన గురించి గుర్తు చేస్తూ.. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా లాహోర్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు. 26/11 ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. భారతీయుల హృదయాలలో చేదు గురించి పాకిస్తాన్లో చేసిన ముక్కుసూటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పురాణ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం లాహోర్లో జరిగిన ఉత్సవం కోసం జావేద్ అక్తర్ గత వారం పాకిస్థాన్ను సందర్శించారు.
ప్రఖ్యాత గీత రచయిత, ఒక పరస్పర చర్చ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి మాట్లాడారు. భారత్-పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని.. పైగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని జావెద్ అక్తర్ అన్నారు. వాటిని తగ్గించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. తాము ముంబయికి చెందిన వాళ్లమని అన్న జావెద్.. ముంబయిసో ఉగ్రవాదులు ఎలాంటి బీభత్సాన్ని సృష్టించారో కళ్లారా చూశామన్నారు. ఉగ్రవాదులు నార్వే లేదు ఈజిప్టు నుంచి వచ్చిన వారు కాదని.. పాకిస్తాన్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. అలాంటప్పుడు భారత్ దాని గురించి ఫిర్యాదులు చేసినప్పుడు మీరు దాన్ని ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదని జావెద్ అక్తర్ వ్యాఖ్యానించారు.
Also Read
Read Also: UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కు అప్లై చేశారా.. గంటలే గడువు!
భారత ఆర్టిస్టులను పాక్లో గౌరవించకపోవడాన్ని జావెద్ అక్తర్ తప్పుబట్టారు. నుశ్రత్ ఫతే అలీ ఖాన్, మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారుల గౌరవార్థం మేం పెద్ద కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఆయన… కానీ లతా మంగేష్కర్ కోసం పాక్ ఎప్పుడైనా ఫంక్షన్ ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. 2008 నవంబరు 26న పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ముష్కరులు ముంబయిలోకి చొరబడి నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడుల్లో 9 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకోగా.. నాలుగేళ్ల తర్వాత 2012లో అతడిని ఉరితీశారు.
పాకిస్థాన్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్లో జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు హర్షం వ్యక్తం చేసిన వారిలో నటి కంగనా రనౌత్ కూడా ఉన్నారు. జావెద్ అక్తర్ కవిత్వం వింటున్నప్పుడు తాను ఆశ్చర్యపోయినట్లు కంగనా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
So….. #javedakhtar sahab went to #Lahore for #FaizFestival2023 and said this! 👏🏻 👏🏻 👏🏻 👏🏻 👏🏻@Javedakhtarjadu sahab 🙏🏼 pic.twitter.com/X6x2Pcp3ef
— SATYA (@satyanas) February 20, 2023
Jab main Javed saab ki poetry sunti hoon toh lagta tha yeh kaise Maa Swarsati ji ki in pe itni kripa hai, lekin dekho kuch toh sachchai hoti hai insaan mein tabhi toh khudai hoti hai unke saath mein … Jai Hind @Javedakhtarjadu saab… 🇮🇳
Ghar mein ghuss ke maara .. ha ha 🇮🇳🇮🇳 https://t.co/1di4xtt6QF— Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!