యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా గురించి తాజాగా ఆమె ఓ అప్డేట్ ను ఇచ్చారు.దేవర సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉందని జాన్వీ కపూర్ తెలిపింది.. తనకు తెలుగు డైలాగ్లు అందాయని, వాటిని నేర్చుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని ఓ మీడియాతో మాట్లాడుతూ జాన్వీ తెలిపింది..తాను కొన్ని రోజులు తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నానని జాన్వీ కపూర్ తెలిపింది..
“ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరికి వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లిష్ మాట్లాడకుండా.. కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా” అని జాన్వీ కపూర్ తెలిపింది.. ఈ చిత్రంలో ఇంకా కొన్ని పాటల షూటింగ్ మిగిలి ఉందని ఆమె వెల్లడించారు. ఈ మూవీలో జాన్వీ పల్లెటూరు అమ్మాయి తంగం పాత్రలో నటిస్తుంది.లంగావోణీలో ఉన్న ఆమె లుక్ అదిరిపోయింది. దేవర పార్ట్ 1 సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే, షూటింగ్ మిగిలి ఉండడం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో చిత్ర యూనిట్ వాయిదా వేసింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.అయితే చిత్ర షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయం అయింది.దీనితో సైఫ్ పూర్తిగా కోలుకోగానే తిరిగి షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు సమాచారం