Bihar: బీహార్ కాంగ్రెస్లో జోష్.. హస్తం గూటికి పప్పు యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో హస్తం గూటికి చేరారు. ఆయన మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పప్పు యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్సభ ఎన్నికల తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి విజయం సాధిస్తోందని పప్పు యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పప్పు యాదవ్ను లోక్సభ ఎన్నికల బరిలో నిలుపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించే మూడో జాబితాలో ఆయన పేరు ఉండొచ్చని సమాచారం.
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు తేజస్వి యాదవ్తో పప్పు యాదవ్ సమావేశం అయ్యారు. తమకు ఒకరిపై మరొకరికి శత్రుత్వం లేదని పప్పు యాదవ్ స్పష్టం చేశారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని పప్పు యాదవ్ ప్రకటించారు. తేజస్వి యాదవ్పై ప్రశంసలు కురిపించారు. గత 17 నెలల బీహార్ పాలనలో తేజస్వి యాదవ్ మార్క్ కనిపించిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తేజస్వి యాదవ్ నిరంతరం పని చేశారని పప్పు యాదవ్ కొనియాడారు.
ఇటీవల జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి నుంచి బయటకు వచ్చి.. బీజేపీ మద్దతు మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్.. ఎన్డీఏ కూటమిలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కూడా క్లారిటీ వచ్చింది. బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ పార్టీ 5 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. బీహార్లో మొత్తం 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Telugu OTT Movies: ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లివే!
అలాగే ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య కూడా సీట్ల పంపకాలపై ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన రానుంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో తేజస్వీ యాదవ్ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్కు 12 సీట్లు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి:Ariaana Manchu: విష్ణు కూతురిలో ఈ టాలెంట్ ఉందా?.. ఫ్యూచర్ స్టార్ అవ్వడం పక్కా..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభం కాగా… జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
#WATCH | Jan Adhikar Party chief Pappu Yadav joins the Congress Party, in Delhi. pic.twitter.com/AXdMpOiZtj
— ANI (@ANI) March 20, 2024
#WATCH | Delhi: Jan Adhikar Party chief Pappu Yadav merges his party with Congress.
He says, "… Since my childhood, I've seen Mohan Prakash Ji struggle and I've received his blessings all my life. He used to be a strong voice back then and now he is an ideology for me. We… pic.twitter.com/MOituy6m74
— ANI (@ANI) March 20, 2024
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!