International Marathon: కశ్మీర్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్.. 2000 మందికి పైగా రన్నర్లు
- కశ్మీర్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్..
- 2000 మందికి పైగా రన్నర్లు.
- 50 మందికి పైగా విదేశీయులు
- పలువురు ప్రముఖులు హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Marathon in Jammu Kashmir: ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. లోయ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్లో 59 మంది విదేశీయులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా రెండు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్లో రూ.3 కోట్ల విలువైన బహుమతులు ఉంటాయి. దీనిని పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. సునీల్ శెట్టితో కలిసి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మారథాన్ను ప్రారంభించారు.
Iran-Israel War : నెతన్యాహు నివాసంపై దాడి తర్వాత గాజాలో విధ్వంసం.. వైమానిక దాడిలో 73 మంది మృతి
Also Read
టూరిజం శాఖ డైరెక్టర్ కశ్మీర్ రాజా యాకూబ్ మాట్లాడుతూ.. లోయలో పరిస్థితి మారిందని ప్రపంచానికి చాటిచెప్పడమే మారథాన్ ఉద్దేశమన్నారు. అదే కాశ్మీర్ అని మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రజలు పగటిపూట కూడా తమ ఇళ్లలో దాక్కోరు. కానీ, ఇప్పుడు ప్రజలు పర్యాటక ప్రదేశాలు, రోడ్లు, పార్కులలో అర్థరాత్రి వరకు షికారు చేస్తూనే ఉన్నారు. మేము ప్రపంచం నలుమూలల నుండి అత్యుత్తమ క్రీడాకారులను ఆహ్వానించాము. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. జర్మనీ, ఇంగ్లాండ్, స్వీడన్, ఆఫ్రికా ఇలా ఇంకా 13 ఇతర దేశాల నుండి రన్నర్లు వచ్చారు. రిజిస్ట్రేషన్లో స్థానికులు కూడా పాల్గొంటున్నారు. మారథాన్ ద్వారా కాశ్మీర్ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను కూడా తెలియచేయనున్నారు. సునీల్ శెట్టి సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీనగర్ చేరుకున్నారు.
PM Modi : మధ్యప్రదేశ్లోని రేవాలో ఎయిర్ పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
42 మంది ఏస్ రన్నర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఈ బృందంలో అనేక మంది ఆసియా బంగారు పతక విజేతలు, ఇంకా.. హాఫ్, ఫుల్ మారథాన్ పోడియం ఫినిషర్లు గోపి డి, మాన్ సింగ్, అంకిత్ దేస్వాల్, నవప్రీత్, పూనమ్, ప్రజాత్గా గాడ్బోలే, తొమ్మిది సార్లు టాటా మారథాన్ ముంబై విజేతలు ఉన్నారు. జ్యోతి కార్తీక్, నేషనల్ ఛాంపియన్ అశ్వని పాల్గొంటున్నారు. భూమ్మీద స్వర్గంగా పిలుచుకునే లోయలోని రోడ్లపై పరుగెత్తే అవకాశం వచ్చిందని, అంతేకాకుండా లోయలో తొలిసారిగా ఇలాంటి మారథాన్లో భాగమైన ఘనత తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు.
#WATCH | J&K | People in large numbers participated in the International Kashmir Marathon held in Srinagar. pic.twitter.com/zhX44d50M5
— ANI (@ANI) October 20, 2024
తాజావార్తలు
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!