International Marathon: కశ్మీర్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్.. 2000 మందికి పైగా రన్నర్లు
- కశ్మీర్లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్..
- 2000 మందికి పైగా రన్నర్లు.
- 50 మందికి పైగా విదేశీయులు
- పలువురు ప్రముఖులు హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Marathon in Jammu Kashmir: ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. లోయ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయి మారథాన్లో 59 మంది విదేశీయులు, బాలీవుడ్ ప్రముఖులతో సహా రెండు వేల మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్లో రూ.3 కోట్ల విలువైన బహుమతులు ఉంటాయి. దీనిని పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. సునీల్ శెట్టితో కలిసి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మారథాన్ను ప్రారంభించారు.
Iran-Israel War : నెతన్యాహు నివాసంపై దాడి తర్వాత గాజాలో విధ్వంసం.. వైమానిక దాడిలో 73 మంది మృతి
Also Read
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
టూరిజం శాఖ డైరెక్టర్ కశ్మీర్ రాజా యాకూబ్ మాట్లాడుతూ.. లోయలో పరిస్థితి మారిందని ప్రపంచానికి చాటిచెప్పడమే మారథాన్ ఉద్దేశమన్నారు. అదే కాశ్మీర్ అని మేము చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రజలు పగటిపూట కూడా తమ ఇళ్లలో దాక్కోరు. కానీ, ఇప్పుడు ప్రజలు పర్యాటక ప్రదేశాలు, రోడ్లు, పార్కులలో అర్థరాత్రి వరకు షికారు చేస్తూనే ఉన్నారు. మేము ప్రపంచం నలుమూలల నుండి అత్యుత్తమ క్రీడాకారులను ఆహ్వానించాము. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు.. జర్మనీ, ఇంగ్లాండ్, స్వీడన్, ఆఫ్రికా ఇలా ఇంకా 13 ఇతర దేశాల నుండి రన్నర్లు వచ్చారు. రిజిస్ట్రేషన్లో స్థానికులు కూడా పాల్గొంటున్నారు. మారథాన్ ద్వారా కాశ్మీర్ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను కూడా తెలియచేయనున్నారు. సునీల్ శెట్టి సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు శ్రీనగర్ చేరుకున్నారు.
PM Modi : మధ్యప్రదేశ్లోని రేవాలో ఎయిర్ పోర్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
42 మంది ఏస్ రన్నర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సునీత మాట్లాడుతూ.. ఈ బృందంలో అనేక మంది ఆసియా బంగారు పతక విజేతలు, ఇంకా.. హాఫ్, ఫుల్ మారథాన్ పోడియం ఫినిషర్లు గోపి డి, మాన్ సింగ్, అంకిత్ దేస్వాల్, నవప్రీత్, పూనమ్, ప్రజాత్గా గాడ్బోలే, తొమ్మిది సార్లు టాటా మారథాన్ ముంబై విజేతలు ఉన్నారు. జ్యోతి కార్తీక్, నేషనల్ ఛాంపియన్ అశ్వని పాల్గొంటున్నారు. భూమ్మీద స్వర్గంగా పిలుచుకునే లోయలోని రోడ్లపై పరుగెత్తే అవకాశం వచ్చిందని, అంతేకాకుండా లోయలో తొలిసారిగా ఇలాంటి మారథాన్లో భాగమైన ఘనత తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు.
#WATCH | J&K | People in large numbers participated in the International Kashmir Marathon held in Srinagar. pic.twitter.com/zhX44d50M5
— ANI (@ANI) October 20, 2024
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..