AP and Telangana: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై జలశక్తి శాఖ కీలక ప్రకటన..
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై జలశక్తి శాఖ కీలక ప్రకటన..
- నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది..
- కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహాలను రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం..
- టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటుకు రెండు రాష్ట్రాల అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Telangana: జల వివాదంపై ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు సమావేశమై చర్చలు జరిపిన విషయం విదితమే.. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగిందని పేర్కొంది..
Read Also: Off The Record: ఆదాల పార్టీ మారుతున్నారా..? వైసీపీని బెదిరిస్తున్నారా..?
Also Read
- Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
- ENG-W vs IND-W: లార్డ్స్లో భారత్ హవా.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా మహిళలు..!
- BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!
ఇక, కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహాలను రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి అని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది.. శ్రీశైలం ఆనకట్టను రక్షించడానికి నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అంగీకరించారు. కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (KRMB) కార్యాలయాన్ని విజయవాడ/అమరావతికి తరలించాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన సమస్యలను సమగ్రంగా మరియు సాంకేతికంగా పరిష్కరించడానికి, రెండు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల నుండి సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ అపరిష్కృత సమస్యలను అధ్యయనం చేయడానికి , సమానమైన, సమర్థవంతమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆచరణీయమైన పరిష్కారాలను సూచించడానికి కలిసి పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సహకారాన్ని పెంపొందించడానికి రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కోసం స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను సులభతరం చేయడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది అని ఆ ప్రకటనలో పేర్కొంది కేంద్ర జలశక్తి శాఖ..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బ్లాక్ సూట్, సన్గ్లాసెస్.. అదిరిపోయిన వైభవ్ లుక్.! వింబుల్డన్ ఫైనల్లో భారత క్రికెట్ త్రయం సందడి.!
-
Hema Malini Biopic: హేమ మాలిని బయోపిక్ లో హీరోయిన్ గా దీపికా పడుకోణె? మనసులో మాట చెప్పిన డ్రీమ్ గర్ల్!
-
ITCZ Bay of Bengal: బంగాళాఖాతం వైపు 10,000 కిలోమీటర్ల పొడవైన మేఘాల సమూహం.. జూలై చివర్లో భారీ వర్షాలకు అవకాశం
-
Team India: ఒకరు అవుట్.. మరొకరిపై బీసీసీఐ అసంతృప్తి.. టీమిండియా కోచింగ్ స్టాఫ్లో భారీ ప్రక్షాళన!
-
Adah Sharma: ప్రమోషన్ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!