AP and Telangana: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై జలశక్తి శాఖ కీలక ప్రకటన..
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై జలశక్తి శాఖ కీలక ప్రకటన..
- నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది..
- కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహాలను రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం..
- టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటుకు రెండు రాష్ట్రాల అంగీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Telangana: జల వివాదంపై ఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ సీఎంలు, నీటిపారుదల శాఖ మంత్రులు సమావేశమై చర్చలు జరిపిన విషయం విదితమే.. అయితే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగిందని పేర్కొంది..
Read Also: Off The Record: ఆదాల పార్టీ మారుతున్నారా..? వైసీపీని బెదిరిస్తున్నారా..?
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇక, కృష్ణా బేసిన్లో నీటి ప్రవాహాలను రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి అని కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది.. శ్రీశైలం ఆనకట్టను రక్షించడానికి నిర్వహణ సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా అంగీకరించారు. కృష్ణా నదీ నిర్వహణ బోర్డు (KRMB) కార్యాలయాన్ని విజయవాడ/అమరావతికి తరలించాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. మిగిలిన సమస్యలను సమగ్రంగా మరియు సాంకేతికంగా పరిష్కరించడానికి, రెండు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాల నుండి సీనియర్ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీ అపరిష్కృత సమస్యలను అధ్యయనం చేయడానికి , సమానమైన, సమర్థవంతమైన నీటి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఆచరణీయమైన పరిష్కారాలను సూచించడానికి కలిసి పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సహకారాన్ని పెంపొందించడానికి రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనం కోసం స్థిరమైన నీటి నిర్వహణ పద్ధతులను సులభతరం చేయడానికి జలశక్తి మంత్రిత్వ శాఖ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది అని ఆ ప్రకటనలో పేర్కొంది కేంద్ర జలశక్తి శాఖ..
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!