Fact Check: రాఫెల్ ఒప్పందంపై భారత్ రహస్య లేఖ లీక్..? జోరుగా ప్రచారం చేస్తున్న పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact Check: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్కు చెందిన భారత రాయబారి థియరీ మాథూకు రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ స్క్రీన్షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ లేఖలో భారత నౌకాదళానికి రఫేల్ యుద్ధవిమానాల డెలివరీ సమయంపై మీడియాలో వచ్చిన కథనాలపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు, అది లీక్ అయిన లేఖ అని పోస్టులు చెబుతున్నాయి. అయితే ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన దర్యాప్తులో ఈ వాదన పూర్తిగా అబద్ధమని తేలింది. ఈ లేఖ పూర్తిగా కల్పితం కాగా, పాకిస్థాన్కు చెందిన ఒక సోషల్ మీడియా ఖాతా దీన్ని ప్రచారం చేస్తోంది.
READ MORE: The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి
Also Read
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
‘డిస్కోర్స్ ల్యాబ్’ అనే సోషల్ మీడియా యూజర్ ఈ లేఖ చిత్రాన్ని షేర్ చేస్తూ.. “జైశంకర్ ఫ్రాన్స్కు రాసిన లేఖ ఒక విషయం స్పష్టం చేస్తోంది. రఫేల్ వివాదం ఇంకా ముగియలేదు. లీకైన సమాచారంతో న్యూఢిల్లీ ఇబ్బందులు పడుతోంది” అని క్యాప్షన్ పెట్టాడు. ఇదే తరహా వ్యాఖ్యలతో మరిన్ని పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. వైరల్ పోస్టులో ఉన్న లేఖ పైకి చూస్తే అధికారికంగా విదేశాంగ మంత్రి రాసిన లేఖలా కనిపించినప్పటికీ.. నిజాన్ని తెలుసుకునేందుకు న్యూస్ ఏజెన్సీ పరిశీలన చేపట్టింది. ‘ఎస్ జైశంకర్ లేఖ’ అనే కీలక పదాలతో సోషల్ మీడియాలో వెతికితే, @HRNagendra1 అనే ఖాతా షేర్ చేసిన ఒక నిజమైన లేఖ లభించింది. అది విదేశాంగ మంత్రి పంపిన అధికారిక లేఖ. ఆ అసలైన లేఖలో అశోక స్తంభ చిహ్నం, జైశంకర్ సంతకం స్పష్టంగా ఉన్నాయి. వైరల్ లేఖతో దీన్ని పోల్చితే రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు కనిపించాయి.
READ MORE: The Raja Saab : ప్రభాస్ చాలా సపోర్టివ్.. అయినా ఆ విషయంలో ఇబ్బంది పడ్డా: నిధి
అంతేకాదు.. ఈ వైరల్ లేఖను నిర్ధారించేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ ఈ లేఖ పూర్తిగా నకిలీదని స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంపై విదేశాంగ వ్యవహారాలను కవర్ చేసే సీనియర్ జర్నలిస్ట్ మధురేంద్ర కుమార్ సైతం ఈ వార్తలను తిప్పికొట్టారు. ఈ లేఖ నకిలీదేనని ఆయన స్పష్టం చేశారు. వైరల్ లేఖను పాకిస్థాన్ నుంచి షేర్ చేస్ఉతన్నారని దర్యాప్తులో తేలింది. ఆ ఖాతా ఏప్రిల్ 2025 నుంచి ఎక్స్లో యాక్టివ్గా ఉంది.
Jaishankar’s letter to France confirms one thing: the Rafale controversy is far from over. New Delhi is struggling to contain the fallout of leaked communications.#sstvi #ชายแดนไทยกัมพูชา#ImACeleb#RafaleDeal #IndianDiplomacy #LeakExposed pic.twitter.com/pkbsfuWUkm
— Discourse Lab (@LabDiscourse) December 8, 2025
Hon. CM of Tamil Nadu Thiru @mkstalin has written to me about the detention of Indian fishermen in Sri Lanka.
My communication in response: pic.twitter.com/GS0RuLodEY
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 27, 2024
తాజావార్తలు
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!