Political Earthquake in Rajasthan: రాజస్థాన్ కాంగ్రెస్కు షాక్.. బీజేపీలో చేరిన 32 మంది కీలకనేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Political Earthquake in Rajasthan: లోక్సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్ కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు మాజీ సీఎం అశోక్ గెహ్లాట్కు సన్నిహితుడైన ఆయన మాజీ కేబినెట్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు లాల్చంద్ కటారియాతో సహా 32 మంది పార్టీ నేతలు బీజేపీలో చేరారు. రాజధాని జైపూర్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం భజన్లాల్ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో ఈ నేతల మెగా చేరిక కార్యక్రమం జరిగింది.
ఈ నేతలతో పాటు పలువురు మద్దతుదారులు కూడా చేయి విడిచి కమలదళానికి పట్టం కట్టారు. రాజస్థాన్ రాజకీయాల్లో ఈ సమూల మార్పు కారణంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ను వీడి బిజెపిలో చేరిన నాయకులలో నాగౌర్లోని చాలా మంది అనుభవజ్ఞులైన జాట్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేతల ఈ మెగా చేరికతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకున్నట్లు బీజేపీ మరోసారి ప్రకటించింది.
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లాల్చంద్ కటారియా, రాజేంద్ర యాదవ్, మాజీ ఎమ్మెల్యే రిచ్పాల్ మిర్ధా, ఖిలాడీ లాల్ బైర్వా, అలోక్ బెనివాల్, విజయపాల్ మిర్ధా, భిల్వారా జిల్లా మాజీ అధ్యక్షుడు రాంపాల్ శర్మ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన నాయకుల్లో ఉన్నారు. వీరిలో కటారియా జహాన్ గెహ్లాట్తో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఖిలాడీ లాల్ బైరవ సచిన్ పైలట్కు గట్టి మద్దతుదారు. కాగా, రాంపాల్ శర్మ మాజీ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి అత్యంత సన్నిహితుడు.
పార్టీలో చేరిన అనంతరం లాల్చంద్ కటారియా మాట్లాడుతూ.. మనస్సాక్షి మేరకే తాను బీజేపీలో చేరానని చెప్పారు. రైతుల డిమాండ్లను సీఎం నెరవేర్చారని కటారియా అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రపంచంలో భారత్కు ప్రధాని నరేంద్రమోడీ గుర్తింపు తెచ్చారన్నారు. బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలలో ఇద్దరు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలో చేరిన నేతలకు బీజేపీ నేతలు కండువా కప్పి స్వాగతం పలికారు.
Read Also:Jayasudha: కమల్ హాసన్ తో పెళ్లి.. నా దగ్గర ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే అస్సలు ఊరుకోను
వీరితోపాటు మాజీ ఎమ్మెల్యే రాంనారాయణ్ కిసాన్, కాంగ్రెస్ నేత అనిల్ వ్యాస్, రిటైర్డ్ ఐఏఎస్ ఔంకర్ సింగ్ చౌదరి, గోపాల్రామ్ కుకున, అశోక్ జాంగీద్, ప్రియాసింగ్ మేఘ్వాల్, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ చౌదరి, రాజేంద్ర పరస్వాల్, షైతాన్ సింగ్ మెహ్రా, రాంనారాయణ ఝజ్రా, మాజీ ప్రధాన్ జగన్నాథ్ బుర్దక్, కర్మవీర్ చౌదరి, కుల్దీప్ దేవా, బచ్చు సింగ్ చౌదరి కూడా ఉన్నారు. వీరితో పాటు రాంలాల్ మీనా, మహేశ్ శర్మ, రంజిత్ సింగ్, మధుసూదన్ శర్మ, సునీతా చౌదరి, మదన్లాల్ అత్వాల్, ప్యారేలాల్ శర్మ, మహేశ్ శర్మ, రాంఖిలాడి శర్మ, రుఘారామ్ మహియా, భిన్యారామ్ పెడివాల్లు కూడా బీజేపీలో చేరారు.
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..