Rajasthan Blast : ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్.. ఐదుగురు మృతి, నలుగురికి సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Blast : రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాలా మందికి సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వారికి చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు.
ఈ మొత్తం వ్యవహారం బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైనాడలో జరిగింది. ఇక్కడ ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఘటన జరిగిన వెంటనే ఫ్యాక్టరీ లోపల నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఇక్కడ పనిచేస్తున్న వారు ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
Read Also:AP Inter Results 2024: ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్..!
ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో భారీ విస్ఫోటనం సంభవించిందని, దీని కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పేలుడు, మంటల కారణంగా కర్మాగారంలో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు కూలీలను బయటకు తీశారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన కూలీలను ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనేక మంది అగ్నిమాపక యంత్రాలు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించిన తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న బస్సీ ఏసీపీ ముఖేష్ చౌదరి మాట్లాడుతూ.. బాయిలర్ పేలుడు కారణంగానే ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు కూలీలు నేరుగా బాయిలర్తో స్పర్శించడంతో వారు మృతి చెందారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయి.
Read Also:SRH vs KKR: ఉత్కంఠపోరులో కేకేఆర్ గెలుపు.. క్లాసెన్ శ్రమ వృధా
తాజావార్తలు
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!