Jagga Reddy : రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారని, రాహుల్ గాంధీ గుడికి పోవద్దా అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గుడికి పోవాలి అంటే.. అస్సాం సీఎం అనుమతి అవసరమా అని ఆయన జగ్గారెడ్డి అన్నారు. మోడీ మెప్పు కోసం అస్సాం సీఎం ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వమే లా అండ్ ఆర్థర్ సమస్య సృష్టిస్తోందన్నారు జగ్గారెడ్డి.
అంతేకాకుండా.. ‘బీజేపీ నేతలు ఈ మధ్యనే కండ్లు తెరిచారు. దేశం కోసం ప్రాణం ఇచ్చినది గాంధీ కుటుంబం. అలాంటి రాహుల్ గాంధీని అడ్డుకునే కుట్ర చేస్తుంది బీజేపీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ని ఎందుకు కలిశారో తెలియదు. గతంలో సీఎంని ఎమ్మెల్యేలు కలవాలి అంటే కుదిరేదీ కాదు. 9 ఏండ్లలో దక్కని అవకాశం.. సీఎం రేవంత్ రెండు నెలలో నే కల్పించారు. రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్న. 9 ఏండ్లలో మీ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఆరోపణలు. గతం గురించి కేటీఆర్ మాట్లాడితే.. మీ గతం గురించి మాట్లాడాల్సి వస్తోంది చూసుకో. కేటీఆర్..పద్దతి కాదు. కేటీఆర్.. తండ్రి.. కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పని చేశారు. మీ నాయనా ఎక్కడ పని చేయకుండా ఉంటే.. రేవంత్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మీ నాయనా డైరెక్ట్ బీఆర్ఎస్తోనే రాజకీయాలు చేశాడా. రేవంత్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది. బీఆర్ఎస్ చంపిన ప్రజాస్వామ్యం ని….కాంగ్రెస్ బతికించింది. ప్రతిపక్ష సభ్యుల గొంతు brs నొక్కింది..కానీ మేము ప్రజాస్వామ్యం ఇస్తున్నాం. సీఎంని కలిసి తమ సమస్య చెప్పుకునే వెసులుబాటు ఇచ్చింది కాంగ్రెస్. శ్రీరాముడు దేవుడు.. వాళ్ళని మొక్కాలి అని బీజేపీ వాళ్ళు చెప్పాలా. దేవుడు పుట్టిన తర్వాత బీజేపీ పుట్టిందా.. బీజేపీ పుట్టిన తర్వాత దేవుడు పుట్టాడా. రాహుల్ గాంధీ ఇంట్లో దేవుణ్ణి మొక్కడా. మోడీ సీతారాముల కల్యాణం చేస్తాడో లేదో తెలియదు. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చేస్తారో లేదో తెలియదు. కానీ ప్రతీ ఏడాది నేను చేస్తా. సీతారామ కల్యాణం మోడీ చేసినట్టు ఎప్పుడైనా చూశారా. బీజేపీ పుట్టి 40 ఏండ్లు.. శ్రీరాముడు..సీతమ్మ పుట్టి నాలుగు యుగాలు అయ్యింది. రాజకీయంగా బతకాలి అని రాముణ్ణి ఎత్తుకున్నది బీజేపీ. మొన్నటి వరకు ఇన్నాళ్లు బతుకమ్మ లేదు అని కవిత బతుకమ్మ పేరుతో సినిమా చూపించింది. ఇప్పుడు మోడీ..రామాలయం పేరుతో సినిమా చూపిస్తున్నాడు. ఇవన్నీ కొద్దీ రోజులే.. బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది అనుకోవడం భ్రమ.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
తాజావార్తలు
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!