Jagga Reddy : నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడే శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది అని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రు పాలన తప్పు పట్టె వాళ్ళు .. నెహ్రు ఉన్నప్పుడే మోడీ పుట్టి ఉంటే బాగుండేది.. మా తప్పు కాదు అది అని, శ్రీరాముడు కూడా దేశానికి మొదటి ప్రధాని నెహ్రు కావాలి అని ఆయన్నే పుట్టించారన్నారు. .గాంధీ..నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి చెప్తా అని ఆయన వ్యాఖ్యానించారు. రామాయణం.. మహాభారతం చరిత్ర ఎలాగా ఉందో.. స్వతంత్ర ము తర్వాత గాంధీ కుటుంబం ది అలాంటి చరిత్ర అని, . గాంధీ…నెహ్రులు రక్తపాతం లేకుండా శాంతి మార్గమే మంచి మార్గం అని నమ్మినవారని, నెహ్రు 16 ఏండ్లు జైలు జీవితం గడిపారని, స్వాతంత్రం వచ్చిన తరువాత ఏకగ్రీవంగా నెహ్రు మొదటి ప్రధానిని చేశారు ప్రజలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యవస్థ తెచ్చిందే నెహ్రు..బీజేపీ నేతలు కాదంటారా..? ఈ చరిత్ర ని కాదనే శక్తి బీజేపీ నేతలకు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ..అమిత్ షా అప్పుడు పుట్టనే లేదని, కిషన్ రెడ్డి.. బండి సంజయ్ నిన్న..మొన్న పుట్టినోళ్లే..! అని ఆయన విమర్శించారు.
అంతేకాకుండా..’దేశంలో ఆకలి చావులు ఉండొద్దని.. ప్రాజెక్టులు కట్టిన చరిత్ర నెహ్రు ది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లు కట్టింది నెహ్రు నే. కేసీఆర్.. కేటీఆర్..హరీష్ మాట్లాడతరు.. కాంగ్రెస్ ఎం చేసింది అని ఇవన్నీ వాళ్లకు కనపడదు. శ్రీరాముడి చరిత్ర చదువుతున్నారు కానీ గాంధీ.. నెహ్రూల చరిత్ర అక్కరలేదా..? . నెహ్రు ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీరాముడు పాలన మొదలైంది.. అదే పునాది. నెహ్రూ పునాదుల నుండే.. చంద్రబాబు.. కేసీఆర్. రేవంత్ పాలన. త్యాగాలు చేయడం రాహుల్ గాంధీ కుటుంబం బ్లడ్ లోనే ఉంది. విద్య, పారిశ్రామిక రంగం తెచ్చిందే నెహ్రు. BHEL తెచ్చింది నెహ్రు..పంచవర్ష ప్రణాళికలు., విదేశీ వ్యవహారాలు మొదలు పెట్టింది కూడా ఆయనే.. బీజేపీ వచ్చి మొదలుపెట్టిందా..? 200 దేశాలకు ఆహారం సరఫరా తెచ్చే పరిస్థితికి దేశాన్ని తీసుకెళ్లారు. దేశంలో ఉక్కు కర్మాగారం.. idpl.. ntpc తో వెలుగులు.. 60 లక్షల కిలో మీటర్లు రోడ్లు వేసింది నెహ్రు నే కదా. జీరో బల్బులతో కరెంటు గ్రామాలకు ఇచ్చింది నెహ్రు. నేను లేవనెత్తిన అంశాలపై చర్చకు వచ్చే దమ్ము ఉందా..?. గుండు సూది నుండి మొదలుకుని.. శాటిలైట్ వరకు తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది. మా చరిత్ర చెప్పకండి..కానీ అబద్ధపు ప్రచారం మాత్రం చేయకండి. శ్రీరాముడు అందరి దేవుడు.. అన్ని మతాల..కులాలు ఉన్నాయి ఆయన హయాంలో. కులం..మతం కు అతీతంగా పాలన చేశారు రాముడు. నెహ్రు పాలన తప్పు పట్టిన వాళ్ళు .. నెహ్రు ఉన్నప్పుడే మోడీ పుట్టి ఉంటే బాగుండేది.. మా తప్పు కాదు కదా.. శ్రీరాముడు కూడా దేశానికి మొదటి ప్రధాని నెహ్రు కావాలి అని ఆయన్నే పుట్టించారు. గాంధీ..నెహ్రు ల చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి.. సీఎం ని కలిసి చెప్తా’ అని ఆయన అన్నారు.
Also Read
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
తాజావార్తలు
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!